Saturday, 12 September 2026 01:31:04 AM
# తోటి వెంకటేష్ పదవీ విరమణ ఘనంగా సన్మానం # సంతకాలు లేని పత్రంతో పట్టాదారు పాసుపుస్తకం..? అగస్తిగానిపల్లి భూమిపై తీవ్ర ఆరోపణలు — రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు # మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు

నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు

Date : 15 July 2026 07:37 PM Views : 467

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని కాగతి గ్రామపంచాయతీ, యనమసామనపల్లి కి చెందిన రైతు ఏడూరు గంగరాజు తన ఐదు ఎకరాల పొలంలో టమాట జయహో టమాట నారును తమ ప్రక్క గ్రామమైన యల్లంపల్లి నందుగల నరసింహారెడ్డి నర్సరీ నందు ఒకలాట్ మొత్తం ముప్పై ఐదువేల జయహో టమాటా నారు కొనుగోలు చేసి నాటారు. ఐతే అతను గత ఇరవై సంవత్సరాలనుండి వ్యవసాయం చేస్తున్ననూ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, ఐతే ఈ ఏడు యల్లంపల్లి నరసింహ రెడ్డి నర్సరీ నందు విత్తనాలు నఏను తీసిస్తానని చెప్పినా వినకుండా ఆయనే సొంతంగా విత్తనాలు కొనుగోలు చేసి నారు ఇచ్చాడని, ఐతే వీటికి 35 లోడ్లు పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు తోలడం జరిగిందని, నీళ్ళు పుష్కలంగా ఉన్నాయని ఆయన వాపోయారు. ఇప్పటి వరకు సుమారు పన్నెండులక్షలు ఖర్చులు పెట్టానని, ప్రస్తుతం కాయలు అన్ సైజ్ వచ్చాయని గోళీలు కావడంతో వాటిని పారబోయడానికి తప్ప ఇంకేమిటికి పనికి రావని, ఇంత పెట్టుబడి పెట్టి లాభం లేదని రైతు గంగరాజు వాపోయాడు. ఈ సందర్బంగా అతని భార్య కళావతమ్మ మాట్లాడుతూ గత రెండీ మూడు రోజుల నుండి నా భర్త చాలా వరకు డిప్రెషన్ లో ఉన్నారని ప్రతి రోజు ఆరువందల బాక్సులు అవుతున్నాయని, నలబై మంది కూలీలు అవసరం ఉందని నా భర్త ఎప్పుడు ఎటువంటి అఘాత్యాలకి పాల్పడుతాడోనని అనునిత్యం కాపలా గా ఉన్నామని, అధికారులు నకిలీ నారు ఇచ్చిన నరసింహారెడ్డి పైన చట్ట రిత్యా చర్యలు తీసుకొని, మాకు న్యాయం చేయాలని అన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :