Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ; తిరుపతి లోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల మరియు ఐ.సి.ఎం.ఆర్ - జాతీయ పోషకాహార సంస్థ, హైదరాబాదు సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 21 మరియు 22 తేదీలలో “క్వాలిటేటివ్ రీసెర్చ్” అనే అంశంపై వర్క్షాప్ను నిర్వహించారు. దీనిలో పాల్గొంటున్న వారికి గుణాత్మక పరిశోధన యొక్క ప్రాథమిక భావనలు మరియు సాంకేతికతలను పరిచయం చేయడానికి మరియు వైద్యంలో గుణాత్మక డేటాను కఠినమైన మరియు నైతిక పద్ధతిలో నిర్వహించడానికి మరియు విశ్లేషించడానికి వీలు కల్పించడానికి ఈ వర్క్షాప్ రూపొందించబడింది. ఈ వర్క్షాప్ లో ఈ రోజు అనగా నవంబర్ 22 తేదీన జరిగిన కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డా. పి.ఏ. చంద్రశేఖరన్ మరియు వైద్య అధ్యాపకులు పాల్గొన్నారు. చిత్తూరు అపోలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డా. ఎం. ఎస్. శ్రీధర్; ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. నోడల్ ఆఫీసర్ డా. ఎస్. సునీత, ఐ.సి.ఎం.ఆర్ - జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డా. జి. సుబ్బారావు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డా. పి. సత్యేంద్ర నాథ్; శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ డా. టి. త్రిపుర సుందరి; మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సేవాగ్రామ్, మహారాష్ట్ర ప్రొఫెసర్ డా. అభిషేక్ రౌత్, ఈ వర్క్షాప్లో పాల్గొని తమ విలువైన ప్రసంగాలు చేశారు. ప్రశ్నాపత్రం/ఇంటర్వ్యూయర్స్ గైడ్ రూపకల్పన, గుణాత్మక పరిశోధన విశ్లేషణ, మిశ్రమ పద్ధతుల పరిశోధన, క్వాలిటేటివ్ పరిశోధనలో ఉపయోగించే సాఫ్ట్వేర్లు మరియు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్) ల ఉపయోగం, ఫోకస్ గ్రూప్ చర్చ మొదలగు వాటి గురించి కూలంకషంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.హెచ్.ఆర్.యు. చంద్రగిరి శాస్త్రవేత్తలు డా. యు.వి. ప్రసాద్, డా. జి. వెన్నెల సాహితి మరియు సిబ్బంది; శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీరకిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV