Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మట్టితో చేసిన వినాయకుని పూజించి పర్యావరణ రక్షణకై నడుంకట్టాలని డాక్టర్ అంకయ్య పిలుపునిచ్చారు.మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాతవీరాపురం నందు ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా విద్యార్థులందరిచే మట్టి వినాయకుని బొమ్మలను తయారుచేయించి వివిధ రకాల పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వే ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పైడి అంకయ్య పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాతవీరాపురం విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను చాలా చక్కగా తయారు చేశారని పిల్లల్లో సృజనాత్మకంగా దాగి ఉన్న కళ ను వెలికి తీసిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. సోమవారం రోజు జరుపుకోబోయే వినాయక చవితి రోజున దేశమంతా అందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలని పూజించి పర్యావరణం కలుషితం కాకుండా భావితరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందించాలని పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో తెలుగు పండితులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ వే ఫౌండేషన్ వారు వినూత్న కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మంచి సందేశం ఇస్తుంటారని పిల్లలందరూ ఈ కార్యక్రమం ద్వారా భావితరానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విష రసాయనాలతో కూడిన గణపతి విగ్రహాలను వాడకుండా మట్టి వినాయకుడిని పూజించడం ఎంతో శ్రేయస్కరమని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అందంగా బొమ్మలు తయారుచేసిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు. పిల్లలు తయారుచేసిన విగ్రహాలు అతిథులను,గ్రామస్తులను, చూపరులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ వెంకటేశ్వర్లు, ఉషారాణి,అంగన్వాడీ కార్యకర్తలు,వే ఫౌండేషన్ వినోద్,చంద్ర శేఖర్ మరియు విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు
Admin
Famous TV