Monday, 02 March 2026 12:27:08 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

మట్టి వినాయకుడిని పూజించండి

ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు

Date : 16 September 2023 06:04 PM Views : 1460

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : మట్టితో చేసిన వినాయకుని పూజించి పర్యావరణ రక్షణకై నడుంకట్టాలని డాక్టర్ అంకయ్య పిలుపునిచ్చారు.మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పాతవీరాపురం నందు ప్రధానోపాధ్యాయురాలు భువనేశ్వరి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ముందస్తు వేడుకలలో భాగంగా విద్యార్థులందరిచే మట్టి వినాయకుని బొమ్మలను తయారుచేయించి వివిధ రకాల పోటీలు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వే ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పైడి అంకయ్య పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పాతవీరాపురం విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను చాలా చక్కగా తయారు చేశారని పిల్లల్లో సృజనాత్మకంగా దాగి ఉన్న కళ ను వెలికి తీసిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. సోమవారం రోజు జరుపుకోబోయే వినాయక చవితి రోజున దేశమంతా అందరూ మట్టితో చేసిన వినాయక విగ్రహాలని పూజించి పర్యావరణం కలుషితం కాకుండా భావితరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందించాలని పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో తెలుగు పండితులు డాక్టర్ దేవరాజులు మాట్లాడుతూ వే ఫౌండేషన్ వారు వినూత్న కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మంచి సందేశం ఇస్తుంటారని పిల్లలందరూ ఈ కార్యక్రమం ద్వారా భావితరానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విష రసాయనాలతో కూడిన గణపతి విగ్రహాలను వాడకుండా మట్టి వినాయకుడిని పూజించడం ఎంతో శ్రేయస్కరమని పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అందంగా బొమ్మలు తయారుచేసిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు. పిల్లలు తయారుచేసిన విగ్రహాలు అతిథులను,గ్రామస్తులను, చూపరులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ వెంకటేశ్వర్లు, ఉషారాణి,అంగన్వాడీ కార్యకర్తలు,వే ఫౌండేషన్ వినోద్,చంద్ర శేఖర్ మరియు విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :