Famous TV - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా : *ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం* .. ►ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ►ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ బిల్లు అమలుకు కేబినెట్ ఆమోదం ►ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయానికి ఇంటి స్తలం లేని వారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలి..ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి ►రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేలా చూడాలి ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 49 అంశాల పై చర్చించిన ఏపీ కేబినెట్.. వాటిలో ప్రధానమైన అంశాలు ►జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పధకం ఏర్పాటుకి ఆమోదం తెలపనున్న కేబినెట్. ► సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఈ పధకం ద్వారా లబ్ది, UPSC లో ప్రిలిమ్స్, mains ఉత్తీర్ణత సాధించిన వారికి 50 వేల నుంచి లక్ష ఆర్ధిక సాయం తదితర అంశాలపై చర్చ ►కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగుల కు జిపిఎస్ అమలు ముసాయిదా బిల్లుల పై చర్చ ►ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు పై చర్చ ►జగనన్న ఆరోగ్య సురక్షపై చర్చించనున్న కేబినెట్ ►కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదన పై చర్చ ►ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ ►పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణంకి ఆమోదం తెలపనున్న కేబినెట్ ►అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణకు పీఓటీ చట్ట సవరణ కు ఆమోదం తెలపనున్న కేబినెట్ ►భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుపై చర్చ ►దేవాదాయ చట్ట సవరణపై చర్చించనున్న క్యాబినెట్.
Reporter
Famous TV