Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : చైల్డ్ ఫండ్ వారి ఆర్థిక సహకారంతో రాష్ట్రీయ సేవా సమితి ప్రధాన కార్యాలయంలో ఈరోజు బాలల రక్షణ విధానం పై జిల్లాస్థాయి కన్వర్జేన్స్ సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశానికి హాజరైన వివిధ రకాల ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలలో పనిచేసే సిబ్బంది పిల్లలతో పనిచేసిన వారి అనుభవాన్ని పంచుకోవడం జరిగినది. ప్రాజెక్టు అధికారి రమేష్ ఈరెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలకోసం పనిచేసే వారందరూ ఒక ఫోరం గా ఏర్పాటై గ్రామ స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలను మండలం లేదా జిల్లా స్థాయికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపై మాట్లాడడం జరిగింది..క్షేత్రస్థాయి లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చలు జరపడం జరిగింది.. ప్రస్తుతం బాలలు ఎదుర్కొంటున్న బాల కార్మికులు, బాల్య వివాహాలు , వివిధ రకాల ధూషణల మరియు మొబైల్ అడ్డిక్షన్ పై ఎటువంటి అవగాహన చర్యలు కొనసాగించాలి, అందరూ కలిసి ఏ విధంగా ఒక ఐకమత్యం గా జిల్లాస్థాయి ఫోరంను ఏర్పాటు చేసుకొని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పిల్లలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కార మార్గంగా తీసుకువెళ్లాలని అందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో కల్పన -DCPU, రామకృష్ణ రెడ్డి -RPF, హేమ శేఖర్ కార్యదర్శి సిర్డ్స్ సంస్థ,అంకయ్య అధ్యక్షులు వే ఫౌండేషన్, సాకం కృష్ణమూర్తి -రియల్స్ ngo తేజస్విని- MSK, స్వాతి అధ్యక్షులు ధాత్రి ఫౌండేషన్, రాస్ బాలవికాస్ ప్రాజెక్ట్ కో ఆర్డినటర్ భారతి,సుధారాణి సీడీపీఓ, కృష్ణమంజరి సీడీపీఓ తదితరులు
Admin
Famous TV