Famous TV - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : బనగానపల్లె మండలం పలుకూరు జిల్లా పరిషత్ పాఠశాల యందు శ్రీ జె కె ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి చెందిన విద్యా వారధి ఫౌండేషన్ చైర్మన్సుబ్బరాజు సహకారంతో పదో తరగతి విద్యార్థులకు మొదటి ర్యాంకు వంద సూత్రాలు ఎండమూరి వీరేంద్రనాథ్ రచించిన పుస్తకాలు పంపిణీ మరియు విద్యా ఆవశ్యకతపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానంద చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు అని అన్నారు క్రమశిక్షణ,పట్టుదల కృషి తోనే విజయం మీ సొంతమన్నారు.ఈ పుస్తకం మీకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.పాఠశాల హెచ్ఎం బి గౌరీ శంకర్ మాట్లాడుతూ మొదటి ర్యాంకు వంద సూత్రాలు పుస్తకాలు అందించిన దాత సుబ్బరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు కష్టపడితే విజయం సొంతమన్నారు.విద్యా ఆవశ్యకత ప్రభుత్వం కల్పించే సదుపాయాలు వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి సుస్మిత,వి శ్రీనివాస్ రెడ్డి,కేసీ నందప్ప డి చంద్రశేఖ,ర్ఏ రామసుబ్బయ్య,కే గోపాల్మొదలగువారు మాట్లాడినారు .అనంతరం పాఠశాలలోని వంద మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగినది.
Admin
Famous TV