Famous TV - ఆంధ్రప్రదేశ్ / : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. 1993 -94 ఎంఎస్సీ ఫిజిక్స్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీలో సమావేశమయ్యారు. నాటి జ్ఞాపకాలని వారు నెమరు వేసుకున్నారు. ఫిజిక్స్ విభాగా అభివృద్ధికీ, విద్యార్థులు ఉన్నతికి తమ వంతు తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. ఇకపై తరచూ సమావేశం కావాలని తీర్మానించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ మాజీ విసి ప్రొఫెసర్ ఎన్ .ప్రభాకర్ రావు, ఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ వైసీ రత్నాకరం లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ బి దే ప్రసాద్ రాజు, డాక్టర్ నటరాజ్, డాక్టర్ ఉమా మహేశ్వర్, ప్రకాష్, శ్రీ హరి, మహేశ్వర్ రెడ్డి, శశిధర్, దేవసేన, డాక్టర్ బాలాజీ, పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV