Sunday, 19 April 2026 05:34:20 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

అండగా ఉంటాం, అధైర్యపడవద్దు మంటలకు కారణాలు త్వరలో తెలుస్తుంది – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

డా..చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

Date : 20 May 2023 06:14 PM Views : 376

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, మే 20 : అండగా ఉంటాం, అధైర్యపడవద్దు ఇప్పటికే మంటలు జరిగిన వాటి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము త్వరలో కారణాలు తెలుస్తాయి తదుపరి ఏమి చేయాలన్నది చేద్దాం అని తిరుపతి చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం మద్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గo కొత్త శానంబట్ల లో చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, అడిషనల్ ఎస్.పి. వెంకటరావు, అధికారులు పర్యటించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ గత వారంగా గ్రామంలో అక్కడక్కడ మంటలు చెలరేగుతున్న వాటిపై ఇప్పటికే నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపామని త్వరలో నివేదిక రానున్నదని, మానవ తప్పిదమో, ఆచార సంప్రదాయాల వల్ల జరిగిందా తెలుస్తుందని, రిపోర్టు రాగానే తక్షణ సహాయ చర్యలు చెప్పడానికే నేడు జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యటించారు. పగలే మంటలు చెలరేగడం జరుగుతున్నది , భయాందోళన లేకుండా అండగా గ్రామంలో మహిళా పోలీసులు 18 మందిని ఇక్కడే ఉంచుతామని అన్నారు. ఇప్పటికే మంటలు చెలరేగిన ఇండ్ల వద్ద పోలీసులు సి.సి. కెమరాలు ఏర్పాటు, పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. అపోహలు, వదంతులు నమ్మవద్దు త్వరలో కారణాలు తెలుస్తాయి , మరో గ్రామంలో ఇలా జరగకుండా జాగ్రత్త పాడుదాం అన్నారు. గ్రామంలో రూ.3.38 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనెజ్ , కమ్యూయునిటీ హాలు, పశు వైద్యశాల , ఆర్.ఓ. ప్లాంటు ఏర్పాటు తక్షణం ప్రారంభమవుతున్నాయి అన్నారు. గ్రామంలో భాదితులు అయిన అరుణ, రాణి, గోపి కృష్ణ గృహాలు సందర్శించి జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు, దైర్యం చెప్పారు. ఈ పర్యటనలో ఆర్డీఓ కనక నరసా రెడ్డి, పర్యావరణ ప్రొఫెసర్ దామోదర్, ఫైర్ అధికారి రమణయ్య, పోలీసు అధికారులు, స్థానికులు ఉన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :