Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి, మే 20 : అండగా ఉంటాం, అధైర్యపడవద్దు ఇప్పటికే మంటలు జరిగిన వాటి నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాము త్వరలో కారణాలు తెలుస్తాయి తదుపరి ఏమి చేయాలన్నది చేద్దాం అని తిరుపతి చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. సోమవారం మద్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గo కొత్త శానంబట్ల లో చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, అడిషనల్ ఎస్.పి. వెంకటరావు, అధికారులు పర్యటించారు. శాసనసభ్యులు మాట్లాడుతూ గత వారంగా గ్రామంలో అక్కడక్కడ మంటలు చెలరేగుతున్న వాటిపై ఇప్పటికే నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపామని త్వరలో నివేదిక రానున్నదని, మానవ తప్పిదమో, ఆచార సంప్రదాయాల వల్ల జరిగిందా తెలుస్తుందని, రిపోర్టు రాగానే తక్షణ సహాయ చర్యలు చెప్పడానికే నేడు జిల్లా కలెక్టర్ గారు కూడా పర్యటించారు. పగలే మంటలు చెలరేగడం జరుగుతున్నది , భయాందోళన లేకుండా అండగా గ్రామంలో మహిళా పోలీసులు 18 మందిని ఇక్కడే ఉంచుతామని అన్నారు. ఇప్పటికే మంటలు చెలరేగిన ఇండ్ల వద్ద పోలీసులు సి.సి. కెమరాలు ఏర్పాటు, పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు. అపోహలు, వదంతులు నమ్మవద్దు త్వరలో కారణాలు తెలుస్తాయి , మరో గ్రామంలో ఇలా జరగకుండా జాగ్రత్త పాడుదాం అన్నారు. గ్రామంలో రూ.3.38 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు రోడ్లు, డ్రైనెజ్ , కమ్యూయునిటీ హాలు, పశు వైద్యశాల , ఆర్.ఓ. ప్లాంటు ఏర్పాటు తక్షణం ప్రారంభమవుతున్నాయి అన్నారు. గ్రామంలో భాదితులు అయిన అరుణ, రాణి, గోపి కృష్ణ గృహాలు సందర్శించి జరిగిన విధానం అడిగి తెలుసుకున్నారు, దైర్యం చెప్పారు. ఈ పర్యటనలో ఆర్డీఓ కనక నరసా రెడ్డి, పర్యావరణ ప్రొఫెసర్ దామోదర్, ఫైర్ అధికారి రమణయ్య, పోలీసు అధికారులు, స్థానికులు ఉన్నారు.
Admin
Famous TV