Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శిక్షకులు సమాజానికి మార్గదర్శకులని జేసీఐ ఇండియా ఉపాధ్యక్షులు ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. స్థానిక మానస ఇన్ హోటల్లో జరిగిన జేసీఐ ఇండియా జోన్-26 స్పీచ్ క్రాఫ్ట్ 2024ను ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తూ మన దేశానికి నాయకులు ఎంత అవసరమో, అంతకు మించి శిక్షకుల అవసరం వుందన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా సరైన శిక్షణ అవసరం అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరానికి రాష్ట్ర నలుమూలల నుంచి 30 మంది ఎంపిక కాబడ్డారు. వీరందరూ శిక్షణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో ఉచిత శిక్షణలు నివహిస్తారు. అలాగే జేసీఐ సభ్యులకు కూడా శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోన్ అధ్యక్షులు కె.కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జేసీఐ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జేసీఐ తిరుపతి ఒడిస్సీ అధ్యక్షులు డా.ఎస్.హరిత, కార్యక్రమ చైర్పర్సన్ డా.పి.నీరజ ఇతర బృందాన్ని అభినందించారు. కీలక ఉపన్యాసకులు జి.ఎల్. మనోహర్ మాట్లాడుతూ జేసీఐ శిక్షణా రంగంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, తన 30ఏళ్ల శిక్షణ అనుభూతులను పంచుకున్నారు. జోన్ ఉపాధ్యక్షులు మనోజ్ విష్ణు మాట్లాడుతూ శిక్షకులు సంస్థలకు ఊపిరి పోసేవాళ్లని తెలియజేసారు. ఈ శిక్షణా కార్యక్రమానికి విశాఖపత్నానికి చెందిన జాతీయ శిక్షకులు జయ లక్ష్మి, రాజమండ్రికి చెందిన అనంత కల్యాణి, కె.వి.ఎన్.కార్తీక్ శిక్షకులుగా ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్పర్సన్ డా లావణ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎన్.లలిత, మన్విత్, జేసీఐ తిరుపతి ఒడిస్సీ కార్యదర్శి కె.శ్రీదేవి, కోశాధికారి పురుషోత్తం, జేసీఐ తిరుపతి శాఖ అధ్యక్షులు టివై చైతన్య తేజ్, ఇతర నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Famous TV