Saturday, 13 June 2026 12:24:40 PM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

శిక్షకులు సమాజానికి మార్గదర్శకులు!

- ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి

Date : 26 April 2024 10:07 PM Views : 759

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శిక్షకులు సమాజానికి మార్గదర్శకులని జేసీఐ ఇండియా ఉపాధ్యక్షులు ఎన్.బి.హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. స్థానిక మానస ఇన్ హోటల్లో జరిగిన జేసీఐ ఇండియా జోన్-26 స్పీచ్ క్రాఫ్ట్ 2024ను ప్రారంభించారు. ఆయన ప్రసంగిస్తూ మన దేశానికి నాయకులు ఎంత అవసరమో, అంతకు మించి శిక్షకుల అవసరం వుందన్నారు. ఏ రంగంలో రాణించాలన్నా సరైన శిక్షణ అవసరం అన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరానికి రాష్ట్ర నలుమూలల నుంచి 30 మంది ఎంపిక కాబడ్డారు. వీరందరూ శిక్షణ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో ఉచిత శిక్షణలు నివహిస్తారు. అలాగే జేసీఐ సభ్యులకు కూడా శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోన్ అధ్యక్షులు కె.కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జేసీఐ సంస్థ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జేసీఐ తిరుపతి ఒడిస్సీ అధ్యక్షులు డా.ఎస్.హరిత, కార్యక్రమ చైర్పర్సన్ డా.పి.నీరజ ఇతర బృందాన్ని అభినందించారు. కీలక ఉపన్యాసకులు జి.ఎల్. మనోహర్ మాట్లాడుతూ జేసీఐ శిక్షణా రంగంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, తన 30ఏళ్ల శిక్షణ అనుభూతులను పంచుకున్నారు. జోన్ ఉపాధ్యక్షులు మనోజ్ విష్ణు మాట్లాడుతూ శిక్షకులు సంస్థలకు ఊపిరి పోసేవాళ్లని తెలియజేసారు. ఈ శిక్షణా కార్యక్రమానికి విశాఖపత్నానికి చెందిన జాతీయ శిక్షకులు జయ లక్ష్మి, రాజమండ్రికి చెందిన అనంత కల్యాణి, కె.వి.ఎన్.కార్తీక్ శిక్షకులుగా ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్పర్సన్ డా లావణ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎన్.లలిత, మన్విత్, జేసీఐ తిరుపతి ఒడిస్సీ కార్యదర్శి కె.శ్రీదేవి, కోశాధికారి పురుషోత్తం, జేసీఐ తిరుపతి శాఖ అధ్యక్షులు టివై చైతన్య తేజ్, ఇతర నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

Reporter

Reporter

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :