Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఎంపిడివో ఆఫీసు వద్ద వేసవి శిబిరం గత నెలరోజులుగా పాల్గొన్న పిల్లలు ఉత్సాహంగా కళారూపాల ప్రదర్శనలతో అలరించారు. రవింద్ర నాథ్ ఠాగూర్ రచించిన " చిలుక చదువు" కథను నాటిక వేసారు. అదే విధంగా " ఎందుకని ఎందుకని" " విజ్ఞాన బాట" పిడుగులం"లాంటి పాటలతో" ఓబయ్య తాత" అభినయ గీతాలతో చక్కగా ప్రదర్శించారు. పాటల, కథల, పద్యాల పోటీల్లో విజేతలకు బాలోత్సవ్ గౌరవాధ్యక్షులు టెంకాయలు దామోదరం , అధ్యక్షులు నారాయణ, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు, జూలియన్ రాజ్, ఎంపిటిసి రాజేశ్వరి, ఎంపిడివో హరిప్రసాద్, లైబ్రేరియన్ శ్రీముఖి శైల్వరాజు, నర్సింహారెడ్డి తదితరులతో పాటు తల్లిదండ్రులు పిల్లలను ప్రసంగించారు. బహుమతి ప్రదానం చేసారు.వివిధ పోటీల్లో ప్రధమ బహుమతి పొందిన వాళ్లలో హాజీరా,దామోదర్ గౌతమ్, రిజ్వాన్ ప్రణతిక, జగత్ భార్గవి లకు వచ్చింది.
Admin
Famous TV