Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు - పలమనేరు రోడ్డు లోని కుమ్మరనత్తం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఐటిఐ కాలేజ్ వద్ద గల హంద్రీనీవా కాలువ దురాక్రమనకు గురవుతున్నదన్న బిజెపి నాయకుల అసత్య ప్రచారం పై భూమి యజమాని నేడు తహసీల్దార్ ను రెవిన్యూ సర్వే అధికారులతో సర్వే చేయించాలని కోరి,శుక్రవారం రెవిన్యూ అధికారులు,సర్వే అధికారులు సమక్షంలో ఎవరు ఐతే గత రెండు రోజుల క్రితం హంద్రీనివా కాలువ భూ అక్రమణ గురి అయిందని సోసియల్ మీడియా,పత్రిక ల ద్వారా బీజేపీ నాయకులు తెలియజేసారో వారిని మరియు కుమ్మరనత్తం గ్రామ సర్పంచ్,మరియు గ్రామ పెద్దలు,రైతుల ఆధ్వర్యంలో పూర్తిగా సర్వే నిర్వహించగా సర్వేనెంబర్ 316 పైకి 5.5 ఎకరాలు భూమి హంద్రీ నివా కాలువ కు వదలి ఉన్నదని.ఈ సర్వేలో కొలిచిన కొలతలు సరి ఐనవని రెవిన్యూ మరియు సర్వే అధికారులు అందరికి కొలిచి చూపించారు.కావున ప్రజలు దయచేసి మాపై హంద్రీ నివా కాలువ ఆక్రమణ వంటి బుటకపు అసత్య ప్రచారం లను నమ్మవద్దని ప్రజలకు మరియు పత్రిక ల వారికి ఈ విషయాన్నీ తెలియజేస్తున్నామన్నారు.
Admin
Famous TV