Famous TV - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లా,పూతలపట్టు మండలం, పీటమిట్ట గ్రామం నందు గల మంగళ్ విద్యాలయంలో ఈరోజు GST మరియు CA దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు మరియు అవగాహనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శ్రీ సురేష్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, కామర్స్ విద్యార్థులకు GST పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి,GST మరియు CA గురించి కులంకషంగా మరియు చక్కగా విద్యార్థినీ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో పి ఇ ఎస్ స్కూల్, బృందావన స్కూల్ , దిగువమాగం అమరరాజా విద్యాలయ అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు, మంగళ్ విద్యాలయ ప్రిన్సిపాల్ ధనంజయ నాయుడు గారు, రాజన్న ఫౌండేషన్ సెక్రటరీ ఆర్. సతీష్ గారు,మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Admin
Famous TV