Wednesday, 29 July 2026 08:16:45 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఈనెల 9వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఖరారు

రాష్ట్రంలో తొలిసారి టిడ్కో ఫ్లాట్ల ప్రారంభత్సవంలో పాల్గొంటున్న సీఎం...

Date : 07 June 2023 03:57 PM Views : 688

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : పర్యటన విజయవంతానికై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజాబాబు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం...* *-అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ రాజాబాబు....* *-కొడాలి నాని ఇలాకాలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా సీఎం సభ జరుగుతుందన్న - జోగి రమేష్...* *-అశేష ప్రజానీకంతో సీఎం సభ నిర్వహిస్తామన్న - ఎమ్మెల్యే కొడాలి నాని...* గుడివాడ:కొడాలి నాని ఇలాక అయినా గుడివాడలో నభూతో నభవిష్యత్ అన్న విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుందని, గుడివాడలో నిర్వహించే సీఎం సభ కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు.ఈనెల తొమ్మిదవ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటన ఖరారు కావడంతో, సీఎం చేతుల మీదుగా జరగనున్న టిడ్కో ఫ్లాట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై పురపాలక సంఘ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి జోగి రమేష్, కలెక్టర్ రాజాబాబు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.సీఎం పర్యటన విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ రాజాబాబు, అధికార యంత్రాంగానికి పలు ఆదేశాలిచ్చారు. సీఎం సభలో పాల్గొనే ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు.30 వేల మందికి నీడనిచ్చే బృహత్తర కార్యక్రమం గుడివాడలో జరగడం సంతోషకరమని మంత్రి జోగు రమేష్ హర్షం వ్యక్తం చేశారు.లేవుట్ లో జరిగిన అభివృద్ధి పనులు, ఫ్లాట్ల నిర్మాణాలు చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని ఆయన అన్నారు.పొరపాట్లు జరగకుండా అధికారులు బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :