Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శుక్రవారం ఎస్వీ వైద్య కళాశాల రుయా ఆసుపత్రి లో జి .సుబ్రమణ్యం చికిత్స పొందుతూ మరణించారు చనిపోయిన జి . సుబ్రమణ్యం సుమారు 22 సంవత్సరాలు , పాలెంకోట గ్రామము,వెంకట గిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి. రుయా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయన తండ్రి జి . చిన్నయ్యా కుమారుడి నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం జరిగినది. రుయా కంటి విభాగము వైద్యులు ఆధ్వర్యంలో జి .సుబ్రమణ్యం నేత్రాలను సేకరించి నేత్ర విభాగ, నేత్ర నిధి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగినది. నేత్రదానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు జి . చిన్నయ్యా , జి .వెంకటమ్మ ,ఇరువురి సమ్మతితో ఆయన నేత్ర లు తీసుకోవడం జరిగినది. వెంటనే నేత్ర విభాగ టెక్నీషియన్ ఎస్ .రమేష్, నేత్రాలను సేకరించి, నేత్ర బ్యాంకులో భద్రపరచడం జరిగినది. నేటి యువత తన తదనంతరం అవయవ దానాలకు, నేత్ర దానాలకు , ముందుకు రావడం జరుగుతున్నది, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేత్రాలను సేకరించడం జరుగుతున్నది. రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జి రవి ప్రభు , మాట్లాడుతూ పేద రోగులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఈ అవయవాలను వారికి అమర్చడానికి ఇలాంటి అవయవ దానాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పుర ప్రజలు ఎవరైనా నేత్ర దానం చేయాలంటే ఈ క్రింది ఫోను నెంబర్ కు సంప్రదించవచ్చును, సెల్ నెంబర్: 8500880126, ఈ కార్యక్రమంలో ఐ బ్యాంక్ టెక్నీషియన్ ఎస్ .రమేష్, మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV