Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : శ్రీకాళహస్తి ఎరియా ఆసుపత్రి నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి.మంగళవారం జై భీమ్ ఆర్మీ టీం సభ్యులు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది. అందులో భాగంగా నూతనంగా ఏరియా హాస్పిటల్ సూపరెండెంట్ గా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ విజయలక్ష్మి గారిని కలిసి హాస్పిటల్ లో వసతుల కల్పన పై చర్చించడం జరిగింది.ఆపరేషన్ థియేటర్ లేనందువలన పేషెంట్లు పడే ఇబ్బందులను, కష్టనష్టాలను సూపర్డెంట్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది .అందుకు సూపరెండెంట్ గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరలో ఆపరేషన్ థియేటర్ ను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకు వస్తామని,మెరుగైన వైద్యం పేషెంట్లకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.తమ ఏరియా హాస్పిటల్ లో ఉన్న సమస్యలు ఆర్వో వాటర్ ప్లాంట్, డయాలసిస్ సెంటర్ దగ్గర డంప్ అవుతున్న మురికి నీరు గురించి, పేషెంట్లు అటెండర్ ల కోసం హాస్పిటల్ వెలుపల ప్రాంతంలో నిర్మించిన మరుగుదొడ్లను వినియోగం లోకి తీసుకు రావాలని కోరడం జరిగింది.
.అందుకు ఆమె సాధ్యమైనంత తొందరగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నం పూట అందించే భోజనాలు కూడా ప్రతిరోజు చెక్ చేయాల్సిన బాధ్యత సిబ్బంది మీద ఉందని అన్నారు.ఒకేసారి రెండు మూడు మృతదేహాలు వచ్చినప్పుడు వాటిని ఉంచడానికి ప్రీజర్ సదుపాయాలు కూడా మెరుగుపరచాలని కోరారు.ఈ సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని సూపర్నెంట్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమ్ ఆర్మీ పట్టణ అధ్యక్షులు కన్నలి రమేష్ మరియు కుంపటి చలపతి, సాధు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV