Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఆర్టీసీ డ్రైవర్ల పై జరుగుతున్న దాడిని నిరసిస్తూ కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు విపరీతంగా పెరుగుతున్నాయని వాటిని నియంత్రించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అని ఆయన విమర్శించారు ఈరోజు పచ్చికాపలం వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఆయన ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న ఒంగోలు వద్ద నిన్న తిరుపతిలో డిఆర్ మహల్ సర్కిల్ వద్ద నేడు పచ్చికాపలంలో ఇలా రాష్ట్రంలో అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో ఆర్టీసీ డ్రైవర్ల పైన దాడులు జరుగుతున్న ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడం నామ మాత్రమైనా చర్యలు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు అయిన విషయమని వెంటనే ఆర్టీసీ అధికారులు డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ల పై దాడి చేయడానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకొని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కటినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ. సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనామాల గురవయ్య. ఏఐటియుసి జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎన్ డి రవి. చంద్రశేఖర్ రెడ్డి .సిహెచ్ శివకుమార్.వై యెస్ మణి. నాగేంద్ర. గోపి. మోహన్ రెడ్డి .మహేంద్ర. మురళి .శివకుమార్ .లాజరస్ .చాముండేశ్వరి. హైమావతి. శశిరేఖ. సుశీల .కార్తీక్. రజాక్. సెల్వ. అమ్ములు పాల్గొన్నారు.
Admin
Famous TV