Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చిత్తూరు ఫేమస్ టివి న్యూస్ - జిల్లాలో రైతన్నలకు యూరియా కొరత అధికంగా ఉందని, అసలు యూరియా నిజంగానే కొత్తగా ఉందా, లేదా కృత్రిమంగా కొరతను సృష్టించారా అన్నది జిల్లా వ్యవసాయ అధికారులే తెలపాలని, జిల్లాలో ఏర్పడిన యూరియా కొరతను వెంటనే తీర్చి రైతన్నలకు సహాయంగా నిలవాలని సెంటర్ ఫర్ ఆక్ట్స్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు ఉత్తరాది గీత సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆవిడ సూర్య (వెలుగు) జాతీయ దినపత్రిక ప్రతినిధితో ఫోన్ లైన్ లో మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ప్రాంతమైన పుంగనూరు నియోజకవర్గంలో రైతులకు ఎంతగానో అవసరమైన యూరియా , రైతులకు సరైన సమయంలో అందక కొరతగా ఉండటం, రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన మేర యూరియాను ఏర్పాటు చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని ఆవిడ మండిపడ్డారు.ఇందుకు నిదర్శనంగా నియోజకవర్గాలలోని ఆయా మండలాలలో యూరియా కోసం వేగపడుతున్న రైతన్న లో దృశ్యాలను చూడొచ్చని అన్నారు. అంతేకాకుండా పుంగనూరు నియోజకవర్గం లో చౌడేపల్లి, సోమల మండలాలలో యూరియా కొరత అధికంగా ఉందని, అందులోనూ పుంగనూరు,చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల, రైతులు అధికంగా వరి సాగు చేశారని వారికి అధికమతాదులో యూరియా ఆవశ్యకత ఉంటుందని అన్నారు. కానీ రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో వారు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా యూరియా కొరతను సకాలంలో తీర్చి రైతులకు సరిపడా యూరియాని అందించటానికి వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆవిడ సూచించారు.
Admin
Famous TV