Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం జాతి నాయకుల విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకట్ యాదవ్ తహశిల్దార్ పార్వతిని కోరారు. నూతనంగా వచ్చిన రెవెన్యూ అధికారి పార్వతిని మర్యాదపూర్వ కంగా కలిసిన ఆయన విగ్రహాల కోసం స్థలాన్ని మంజూరు చేయాలని కోరారు. చౌడేపల్లి మండల కేంద్రం చౌడేపల్లి నందు ప్రధాన కూడలి బస్టాండులో మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు స్థాపించ డానికి అదేవిధంగా మండలంలో 29 ఏ చింతమాకులపల్లి కూడలియందు, కాగతి గ్రామ పంచాయతీ, పెద్దూరు కూడలిలో, అలాగే దిగువపల్లి గ్రామపంచాయతీ, కొలింపల్లి కూడలి యందు మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల స్థాపన కొరకు స్థలం కేటాయించవలసింది రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు సురేష్, కార్తీక్ పాల్గొనడం జరిగింది.
Admin
Famous TV