Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ శ్రీకాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి జనమాల గురవయ్య..ఏఐటీయూసీ కాళహస్తి నియోజకవర్గం కార్యదర్శి వై ఎస్ మణి లతో కలిసి రేణిగుంట గ్రామపంచాయతీ కార్మికులు కాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతినెలా సక్రమంగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని .. జీతాలు మీదనే ఆధారపడే జీవితాలు పంచాయతీ కార్మికులవని .కార్మికుల జీతాలలో పట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ (పి ఎఫ్ )డబ్బులు కూడా అకౌంట్ లో జమ చేయడం లేదని వారికి చెల్లించాల్సిన యూనిఫామ్ లు కొబ్బరి నూనె షూ లు . షేఫ్టీ మెజర్మెంట్స్ చెల్లించటం లేదని అనేక సందర్భాల్లో ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేసిన సర్పంచ్ గారు హామీలు ఇస్తున్నారు తప్ప వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయని కారణంగా ఈరోజు ఎమ్మెల్యే గారిని కలుస్తున్నామని వారు చెప్పడం జరిగింది. ఈ సమస్యలన్నీ విన్న శాసనసభ్యులు వెంటనే సంబంధిత పై అధికారులతో చర్చించి త్వరిత గతిన పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేలనెలా జీతాలు కార్మికులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఇంకా ఇండస్థలాలు లేని పంచాయితీ కార్మికులందరి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అధ్యక్షులు మురళి రేణిగుంట మండల కార్యదర్శి వి కార్తీక్ పంచాయితీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వెంకటమ్మ చంద్రకళ గోవిందమ్మ శీను ప్రసాదు తదితర పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
Admin
Famous TV