Thursday, 30 July 2026 01:33:07 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఓజోన్ ని కాపాడుకుందాం భూమిని రక్షించుకుందాం

Date : 16 September 2023 05:59 PM Views : 1531

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్.మల్లవరం నందు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కె.వెంకటరమణ అధ్యక్షతన ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు..ఈసందర్భం ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ ఓజోన్ పొరను ని మనం రక్షిస్తే అది భూమిమీద నివసించే జీవరాశులను రక్షిస్తుందని కనుక భావి భారత పౌరులైన మీరందరూ ప్రతిన బూని ఓజోన్ ని రక్షించాలని పిలుపునిచ్చారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ మన భూమి నుంచి 19 మైళ్ళ ఎత్తులో ఓజోన్‌ పొర ఉందని,ఇది భూమిపై నివసించే మానవాళి, ఇతర జీవరాశుల మనుగడకు ఎంతో కీలకమని ఓజోన్‌ అంటే.. 3 ఆక్సిజన్‌ పరమాణువులు కలిస్తే ఏర్పడే మూలకమని సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుందని ఒకవేళ ఓజోన్‌ పొర అడ్డుగా లేకపోతే.. సూర్యుడి కిరణాలు నేరుగా మనుషుల మీద పడి చర్మ క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులను కలిగిస్తాయని,కాలుష్య ఉద్గారాలు, ఏసీ వాడకం వల్ల వెలువడే ఉద్గారాల కారణంగా ఓజోన్‌ పొర దెబ్బతింటోందని ఇప్పటికే ఓజోన్‌ పొర క్షీణిస్తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు 1982లో గుర్తించారని ఇలాంటి పరిస్థితులే కొనసాగిస్తే భవిష్యత్తులో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్‌ సంరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. తొలిసారిగా 1987లో 24 దేశాల ప్రతినిధులు కెనడాలోని మాంట్రియల్‌లో ఓజోన్ పొర క్షీణిస్తున్న భయంకరమైన పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమయ్యారని ఓజోన్‌ పొర క్షీణతను అరికట్టాలని తీర్మానించాయని అప్పటి నుంచే.. ప్రతి సంవత్సరం అదే రోజున అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాము కనుక మీరందరూ భాధ్యత గా మెలగాలని ఆకాంక్షించారు..కార్యక్రమం లో వ్యాస రచన, వకృత్వం,చిత్రలేఖనం,క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు,ప్రశంసా పత్రాలు అందించారు..కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిట్టిబాబు,బ్రహ్మానందరెడ్డి,రవి,పరందామ రెడ్డి, దేవరాజులు,చూడామణి తదితర ఉపాధ్యాయులు,వే ఫౌండేషన్ ప్రతినిధులు వినోద్,చంద్ర శేఖర్,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: