Monday, 02 March 2026 12:27:21 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

ఓజోన్ ని కాపాడుకుందాం భూమిని రక్షించుకుందాం

Date : 16 September 2023 05:59 PM Views : 1385

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్.మల్లవరం నందు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ కె.వెంకటరమణ అధ్యక్షతన ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు..ఈసందర్భం ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ మాట్లాడుతూ ఓజోన్ పొరను ని మనం రక్షిస్తే అది భూమిమీద నివసించే జీవరాశులను రక్షిస్తుందని కనుక భావి భారత పౌరులైన మీరందరూ ప్రతిన బూని ఓజోన్ ని రక్షించాలని పిలుపునిచ్చారు.వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్య మాట్లాడుతూ మన భూమి నుంచి 19 మైళ్ళ ఎత్తులో ఓజోన్‌ పొర ఉందని,ఇది భూమిపై నివసించే మానవాళి, ఇతర జీవరాశుల మనుగడకు ఎంతో కీలకమని ఓజోన్‌ అంటే.. 3 ఆక్సిజన్‌ పరమాణువులు కలిస్తే ఏర్పడే మూలకమని సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుందని ఒకవేళ ఓజోన్‌ పొర అడ్డుగా లేకపోతే.. సూర్యుడి కిరణాలు నేరుగా మనుషుల మీద పడి చర్మ క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులను కలిగిస్తాయని,కాలుష్య ఉద్గారాలు, ఏసీ వాడకం వల్ల వెలువడే ఉద్గారాల కారణంగా ఓజోన్‌ పొర దెబ్బతింటోందని ఇప్పటికే ఓజోన్‌ పొర క్షీణిస్తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు 1982లో గుర్తించారని ఇలాంటి పరిస్థితులే కొనసాగిస్తే భవిష్యత్తులో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్‌ సంరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. తొలిసారిగా 1987లో 24 దేశాల ప్రతినిధులు కెనడాలోని మాంట్రియల్‌లో ఓజోన్ పొర క్షీణిస్తున్న భయంకరమైన పరిస్థితిపై చర్చించేందుకు సమావేశమయ్యారని ఓజోన్‌ పొర క్షీణతను అరికట్టాలని తీర్మానించాయని అప్పటి నుంచే.. ప్రతి సంవత్సరం అదే రోజున అంతర్జాతీయ ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటున్నాము కనుక మీరందరూ భాధ్యత గా మెలగాలని ఆకాంక్షించారు..కార్యక్రమం లో వ్యాస రచన, వకృత్వం,చిత్రలేఖనం,క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు వే ఫౌండేషన్ వారు బహుమతులు,ప్రశంసా పత్రాలు అందించారు..కార్యక్రమం లో ఉపాధ్యాయులు చిట్టిబాబు,బ్రహ్మానందరెడ్డి,రవి,పరందామ రెడ్డి, దేవరాజులు,చూడామణి తదితర ఉపాధ్యాయులు,వే ఫౌండేషన్ ప్రతినిధులు వినోద్,చంద్ర శేఖర్,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :