Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని దిగువపల్లి గ్రామపంచాయతీ లో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ దేవస్థానం లో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కి తొందరగా బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ దేవస్థానం లో చౌడేపల్లి వైకాపా మండలాద్యక్షులు నాగభూషణ రెడ్డి ఆద్వర్యం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోనేటి వద్ద వెయ్యిన్ని నూట పదహారు కొబ్బరి కాయలు కొట్టారు.ఈ సందర్బంగా మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని లిక్కర్ కేసలో కావాలనే కక్ష్య పూరితంగానే ఇరికించారని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని రాజకీయం గా ఎదుగుదలను జీర్ణించుకోలేక అక్రమ మద్యం కేసలో ఇరికించారని, అంతే కాకుండా రాష్ట్ర మంతా తెలుగదేశం గాలి వీచినా పెద్దిరెడ్డి కుటుంబం పోటీచేసిన ప్రతిచోట గెలిచారని, అలాగే రాజకీయం గా వారిని ఎదుర్కోవడం చేతకాక అక్రమ కేసులలో ఇరికించారని, ఆయన అక్రమ లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అన్నారు.ప్రజలు అంతా గమనిస్తున్నారని,కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.అంతే కాకుండా కూటమి ప్రభుత్వం లో జెండాలు మోసిన కార్యకర్తలను ప్రక్కన పెడుతున్నారని, అటువంటివారు మా పార్టికి ఆకర్షితులౌతుంటే వాళ్ళను బెధిరించి, అక్రమ కేసులు బనాయిస్తామని, ప్రలోబాలకు గురిచేసి తిరిగి వారి పార్టీలో చేర్చుకోవడం వలన వాళ్ళకే నష్టం వాటిల్లుతుందని, ఇటువంటివన్నీ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో జడ్పిటీసి దామోదర్ రాజు, వైస్ యం. పి. పి. సుధాకర్ రెడ్డి,మాజీ యం. పి. పి రుక్మిణమ్మ, బోయకొండ మాజీ చైర్మన్ మిద్దింటి శంకర్ నారాయణ, మండల ఉపాధ్యక్షులు జంగాలపల్లి వెంకట్రమణ, దుర్గసముద్రం చెంగారెడ్డి,యువనాయకుడు మిద్దింటి కిషోర్,మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, బోయకొండ మాజీ పాలకమండలి సభ్యులు శెట్టిపేట శంకరప్ప, పవన్, సర్పంచ్ లు ఓబుల్ రెడ్డి, షామీర్, షంషీర్, చిట్రెడ్డిపల్లి కృష్ణప్ప, దుర్గసముద్రం అమరనాథ్, యం. పి. టీ. సి శ్రీరాములు, నాయకులు ఓబులేశు, సుబ్రమణ్యం రాజు, గడ్డం వారి పల్లి గిరి, ఓదులపెట సుబ్రమణ్యం, శేషాద్రి, కాగితి వెంకట్రమణ, బుటకపల్లి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV