Famous TV - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ ( విజయవాడ ) : జూన్ 7న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. అందుకే ఈ కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి ఉంటారేమోనని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగనున్నాయని వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయా? పార్టీ అధినేతలు పర్యటనతోను,పొత్తుల ఎత్తుల కోసం కసరత్తులు చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల అధినేతల బిజీ చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా అనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి'యాత్ర, సభల్లో పాల్గొనేందుకు ఏపీకి ఢీల్లీ అగ్రనేతలు రాక, గడప గడపకు అంటూ వైసీపీ కార్యక్రమాలు..ఇలా ఏపీలో వాతావరణం ముందస్తు ఎన్నికలకు సంకేతంగా కనిపిస్తోంది.
Admin
Famous TV