Saturday, 13 June 2026 11:05:11 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

పులికాట్ పై లోకేష్ అసత్య ప్రచారం

మత్స్యకారులపై కపట ప్రేమ ఓట్ల కోసమే లోకేష్ డ్రామా - ఎంపీ గురుమూర్తి

Date : 26 June 2023 03:50 PM Views : 708

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో నారా లోకేష్ పులికాట్ ముఖద్వారం పూడిక తీత గురించి పరుష పదజాలంతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన హామిని విస్మరించారు అనే లోకేష్ విమర్శలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. గూడూరు నియోజకవర్గం రాయదొరువు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడిక తొలగించే కార్యక్రమానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు సూచనలతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్న విషయం అందరికీ విధితమే ఇటీవల కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖను సంప్రదించగా కేంద్ర మత్స్యశాఖ అనుమతుల కోసం లేఖ రాసారని మత్స్యశాఖ అనుమతి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ అనుమతితో రూ.128 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో పూడిక తీత పనులు జరుగుతాయి అని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్న విషయం పాపం లోకేష్ కి తెలిసినట్లు లేదు, మాట్లాడేందుకు సమస్యలు ఏమి లేక నోటికొచ్చింది మాట్లాడటం చేతికి రాసిచ్చింది చదవడం ఊక దంపుడు ఉపన్యాసాలతో మత్స్యకారులపై కపట ప్రేమ వలకబోస్తున్నాడని ఎంపీ గురుమూర్తి ఎద్దేవా చేసారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకారులకు అండగా ఉండేందుకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకంతో 21 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన 1.32 లక్షల మందికి మత్స్యకార భరోసా కింద 10 వేల రూపాయలు అందిస్తూ మత్స్యకారులకి ఏదైనా మేలు చేసిన ప్రభుత్వం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ఆదర్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని ఆయన అన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :