Famous TV - ఆంధ్రప్రదేశ్ / : మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా వేమన విజ్ఞాన కేంద్రం నందు జ్యోతిబాపూలే కి పుష్పమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లారపు నాగార్జున వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మాట్లాడుతూ విద్యలేక వివేకంలేదు. వివేకంలేక నీతిలేదు. నీతిలేక పురోగతిలేదు. పురోగతిలేకవిత్తంలేదు విత్తం లేకనే శూద్రుడు అధోగతిపాలయ్యాడు. వీటన్నింటికీ విద్య లేకపోవడం వల్లనే నమ్మి సత్యశోధక్ సమాజం ఏర్పాటు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడిన ధీరుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కొనియాడారు.ఆనాటి సమాజంలో ఉన్న అంటరానితనం, వివక్షతలపై గురిపెట్టిన అస్త్రం "గులాంగిరి"రచన అన్నారు. అనంతరం ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు ఆకుల మల్లేశ్వర రావు గారు మాట్లాడుతూ అణ గారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే అని, మహిళల విద్య కోసం అనేక పాఠశాలలను నెలకొల్పి మహిళా విద్య కోసం అహర్నిశలు కృషి చేశారని,తన భార్య సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్థానం సంపాదించారని వితంతువుల పిల్లల ను అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేమన విజ్ఞాన కేంద్రం,JVV నాయకులు దామోదరం,నడ్డి నారాయణ,రెడ్డెప్ప, ముఖేష్, తమటo రామచంద్రారెడ్డి, మురళి ,నాగరాజు,డా"బాలాజీ, ఓ వెంకటరమణ, భాగ్యలక్ష్మి ,మునిలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV