Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కృషితో డబుల్ డెక్కర్ బస్సులు ఈరోజు నుంచి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, ప్రజల సౌకర్యార్ధం వారం రోజుల పాటు ప్రయాణికులకు ఉచిత సర్వీస్ అందించడం జరుగుతుందని దీనిని అందరు ఉపయోగించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ బస్సును గురువారం జెండా ఊపి ప్రారంభించారు. కమిషనర్ హరిత,మేయర్ డా. శిరీష, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
Admin
Famous TV