Famous TV - ఆంధ్రప్రదేశ్ / ప్రకాశం ( ఒంగోలు ) : దర్శి సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ లో మెరుగైన వైద్య చికిత్స పొందుతున్న ముగ్గురు షేక్ యసదన్, మూళ్ళ షబ్బీర్ మరియు షేక్ సలీమున్నీసా లను APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ. పరామర్శించారు. APSRTC ఎండీ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, ప్రమాదం జరిగిన తీరును క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఆందోళన చెందవద్దని, మనోధైర్యంతో ఉండాలని, వారికీ ధైర్యం నింపి, వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఆసుపత్రిలోని డాక్టర్లు, యాజమాన్యంతో మాట్లాడి క్షతగాత్రులకు ట్రీట్మెంట్ మంచిగా అందించాలని సూచించారు. APSRTC ఎండీ, జిల్లా ఎస్పీ గార్ల వెంట DSB DSP బి.మరియాదాసు, ఒంగోలు సబ్ డివిజన్ డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ ఎండీ అంకిరెడ్డి, ఒంగోలు తాలూకా సిఐ రాంబాబు, ఆర్టీసీ అధికారులు మరియు తదితరులు ఉన్నారు
Admin
Famous TV