Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు.డిఐజీ పర్యటన సందర్బంగా భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.చౌడేపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులుమధుసూధన్,గువ్వల రమేష్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.బోయకొండ గంగమ్మ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి, ఉపకమీషనర్ ఏకాబరం ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.అమ్మవారి రాహుకాల అభిషేకం అనంతరం అమ్మవారిని డిఐజీ ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు.అనంతరం వేదపండితులు వేదాశిర్వాదం చేశారు.ఆలయ ఉపకమీషనర్ అమ్మవారి తిర్థ,ప్రసాదాలు అందించారు.ఈ సందర్బంగా డిఐజీ మాట్లాడుతూ ఇటీవల పుంగనూరు,చౌడేపల్లి ప్రాంతాలు చిత్తూరు నుండి అన్నమయ్య జిల్లాలో కలిశాయని,ఈ ప్రాంతాల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడాని ఈ పర్యటన చేస్తున్నామని,దేవస్థానం తరపున పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు, సహాయ సహాకారాలు అడిగారని ఏర్పాటు చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి ధీరజ్ కునిబిల్లి, మదనపల్లి డిఎస్పి మహేష్, పుంగనూరు సర్కిల్ ఇన్పెక్టర్ సుబ్బరాయుడు, పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ సాయి ప్రసాద్, ఎస్సై నాగేశ్వరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV