Famous TV - ఆంధ్రప్రదేశ్ / : రేణిగుంట మండలం కరకంబాడి అమరరాజా విద్యాలయంలో 75వ ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శుక్రవారం నిర్వహించారు, ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమరరాజా కంపెని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ మన రాజ్యాంగం లోని విధులను బాధ్యతగా నిర్వర్తించాలని , విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణించాలని తెలియజేశారు . రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు, ప్రదర్శించిన వివిధ శకటాలు , సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయురాలు గ్లోరి దేవప్రియ, ఉప ప్రధానోపాధ్యాయురాలు జయంతి, ఉపాధ్యాయులు , విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
Famous TV