Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతి ఫేమస్ టీవి న్యూస్ : జాతీయ రహదారి భద్రతా మాసం 2026 లో భాగంగా వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ జి ఎస్ హై స్కూల్ తిరుపతి నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అతికా నాజ్,మెడికల్ ఆఫీసర్ పూజావాణి,పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హెల్మెట్లు ధరించాలని, మోటార్ కార్లు,ట్యాక్సీ డ్రైవర్లు సీటు బెల్టులు ధరించాలని వాహనదారులకు సలహాలు ఇచ్చారు.అవగాహన కల్పించారు.ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్పై రహదారి వినియోగదారులకు అవగాహన కల్పించారు.తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని సూచించారు.అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ నడపడం,వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని డ్రైవర్లకు అవగాహన కల్పించారు.ద్విచక్రవాహనాలు నడుపుతూ హెల్మెట్ ధరించి వెళ్లే వాహనదారులకు,కార్లలో సీటు బెల్టులు ధరించి వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడి అంకయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Famous TV