Famous TV - ఆంధ్రప్రదేశ్ / : యస్వీయూ ప్రాచ్య పరిశోధన సంస్థలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీవిరమణ పొందిన, యన్ యం ఆర్ గా పనిచేస్తూ టీచర్ పోస్ట్ పొందిన ఉద్యోగుల ముగ్గురిని డైరెక్టర్ డా॥ పి సి వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. క్లర్క్ మరియు టైపిస్టుగా 25 సంవత్సరాలు సంస్థకు సేవలందించిన శ్రీ గంగా సువర్ణ , రీసెర్చి అసిస్టెంట్ గా 24 సంవత్సరాలు సేవలందించిన డా॥ ఇ. గురుమూర్తి మంచి నడవడికతో , నిబద్ధతో పనిచేశారని , అలాగే 1998 డియస్సీలో క్వాలిఫైతో ఇటీవల ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగంలో చేరిన పద్మజ స్కానింగ్ , డిజిటలైజేషన్ నేర్పరితనంతో చేశారని వారి సేవలకు గుర్తుగా చిరు సన్మానం చేయడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డా॥ రాజశేఖర్ , డా॥ వెంటేశన్, డా॥ విజయకుమార్, చంద్రశేఖర్ , సిద్దయ్య, నాగరాజు, శోభన్ బాబు, భాషా, రమేష్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి , యోగీశ్వరరావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు
Admin
Famous TV