Thursday, 30 July 2026 10:22:44 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తిరుమల అందాలు చూడతరమా

అరకు, ఊటి ని తలపిస్తున్న తిరుమల కొండలు

Date : 18 October 2024 09:16 AM Views : 1018

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుమల స్పెషల్ : బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలతో తిరుమల కొండలపై వాతావరణం చల్లగా మారింది , దట్టమైన పొగ మంచుతో పచ్చని కొండలు పాల సముద్రం లా కనువిందు చేస్తున్నాయి. తిరుమల గిరులు ఊటి, కోడైకెనాల్, అరకును తలపిస్తున్నట్లు ఉండడంతో పర్యాటకులు, భక్తుల తాకిడి ఎక్కువ అయింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇలాంటి వాతావరణం ఏర్పడటం సహజం కానీ ఈ సారీ బంగాళాఖతం లొ అల్ప పీడనం కారణం గా కాస్త ముందుగానే వాతావరణం మారింది.

తిరుమల కొండ అనగానే పవిత్రతతో పాటు ప్రకృతి అందాలకు కూడా నిలయమే. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు ఓ వైపు.. మంచు శేషాచల పర్వతాన్ని ముద్దాడుతుంటే….మరో వైపు అదే జలపాతం నుంచి జల ధారలు కురుస్తుండడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.వర్షం వస్తుందంటే చాలు తిరుపతి ప్రజలకు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు తమ సెల్ ఫోన్లలో అందాలను ఫోటోలతో సెల్ఫీలతో తమ ఫోన్లో బంధించేస్తారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తిరుపతిలోని కపిల తీర్థం ఉధృతికంగా జాలువారుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ప్రజలు. అరకు అందాలను తలపిస్తుందని పలువురు భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కపిల తీర్థంలో కొండ అంచుల నుంచి జాలువారుతున్న వాటర్ ఫాల్స్ చాలా అందంగా అద్భుతంగా ఉందని భక్తులు పరవశించిపోతున్నారు.

సహజంగా వాటర్ ఫాల్స్ చూడాలంటే ఖర్చుతో కూడుకున్నది, అయితే తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు, స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలు చూస్తూ ఆనందిస్తున్నారు. చిన్నలు పెద్దలు సైతం ప్రకృతి అందాలలో సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా తిరుమల యాత్రకు వచ్చే భక్తులు కపిలతీర్థంలో స్నానాలు ఆచరించి…. శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించి తిరుమల యాత్ర ప్రారంభించడం ఆనవాయితీ. ఈ వర్షాలకు కపిల తీర్థం లొ నీరు ఉదృతంగ ప్రవహించడం వలన స్నానాలకు అనుమతి లేదు.. ఇలాంటి అందాలను ఆశ్వదించాలంటే మనం ఇపుడే తిరుమల బయలుదేరాల్సిందే.............మాచర్ల హరిప్రసాద్, రిపోర్టర్, తిరుమల

HARI PRASAD

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :