Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఏర్పేడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లంలో 30 మంది ఉపాధ్యాయ సిబ్బందికి మరియు 520 మంది విద్యార్థులకు... రేణిగుంట మండలం కరకంబాడి ఉన్నత పాఠశాలలో ఫిసికల్ సైన్స్ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న కుమారి సుధారాణి గారు ఈరోజు(15/09/2023, శుక్రవారం) అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగినది.. ఈ సందర్భంగా పల్లం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీఆనంద్ మాట్లాడుతూ.. కుమారి సుధారనిగారికి పేదవిద్యార్థులంటే చాలా ఇష్టమని... అనేక సందర్భాలలో వారి యొక్క మానవత్వాన్ని పేద విద్యార్థులపట్ల చూపేవారని తెలియచేశారు ..... వారు తయారసిన సైన్స్ ప్రాజెక్టులు జిల్లా స్థాయిలోను, రాష్ట్ర మరియు జాతీయ స్థాయికి ఎంపిక చేయపడ్డాయని... ప్రతి ప్రాజెక్టు ను తన స్వంత ఖర్చులతో తయారుచేసి అహర్నిశలూ కృషి చేసి కరకంబాడి పాఠశాల స్థాయిని జాతీయ స్థాయికి తీసుకుపోవడంలో సుధారాణిగారి కృషి అమోఘమని కొనియాడారు. పాఠశాలలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసినందుకు కుమారి సుధారాణిగారికి పల్లం ఉన్నత పాఠశాల తరపున శ్రీ ఆనంద్ గారు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి .ఉపాధ్యాయులు KV బాబు గారు ,మేహార్ బాబుగారు, శ్రీనివాసులు,రాజశేఖర్, రెడ్డెప్ప, విజయశేఖర్, చలపతి, గుఱ్ఱప్ప,రామసుబ్బమ్మ,శ్రీరాములు.,సోమశేఖర్ రాజు,గంగులయ్య, సురేష్, వెంకట్రామయ్య పాల్గొన్నారు
Admin
Famous TV