Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ న్యూస్ : మండలంలోని ఆమినిగుంట పంచాయతీ, సింగిరిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం కొందరు వైసిపి నాయకుల ప్రోద్బలంతో తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి సమక్షంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను మభ్యపెట్టి నాగరాజు నాయుడు నరేష్ నాయుడు రాజశేఖర్ నాయుడు తదితరులకు వైసిపి కండువా వేసి పార్టిలోకి ఆహ్వానించారు.అయితే వెంటనే జరిగిన తప్పిదాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయంతో మండల అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) వివరించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో తిరిగి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ ఎదో క్షణికావేశంలో తప్ప ఇష్టపూర్వకంగా వైసిపి కండువా కప్పుకోలేదని ఇకమీదట ఇలాంటి పొరపాటు చేయకుండా కన్నతల్లిలాంటి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని విడిచివెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. పార్టి వున్నంతవరకు కాకున్నా ప్రాణం వున్నంత వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతామని తెలియజేసారు.చల్లా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసిపి పార్టీ నాయకులు ఇకనైనా ఇలాంటి చర్యలు ఆపాలని ఇలాంటి మోసపూరిత మాటలు మభ్యపెట్టే చర్యలు ఇకనైనా ఆపాలని అన్నారు.ఇదివరకే పార్టిలో చేరిన గంటల వ్యవదిలోనే తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్బాలు వున్నాయని గుర్తు చేరారు.కార్యక్రమములో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Famous TV