Wednesday, 29 July 2026 05:34:32 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

ఈ. ఎస్. ఐ. ఆసుపత్రి లో తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. సుభాష్.

వైద్యసేవలపై రోగుల నుండి ఆరా

Date : 06 December 2024 06:41 PM Views : 1009

Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ** తిరుపతి నగరం, స్థానిక ఆర్. సి. రోడ్ లోని కార్మిక రాజ్య బీమా (ఈ. ఎస్. ఐ )ఆసుపత్రి ని శుక్రవారం ఉదయం రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీ, బాయిలర్స్, బీమా వైద్య శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి. సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని పురుషుల వార్డును తనిఖీ చేసి, పేషెంట్స్ కు అందుతున్న వైద్య సేవల విషయమై అక్కడ చికిత్స పొందుతున్న రోగులను నుండి అడిగి తెలుసుకున్నారు. అలాగే,ల్యాబ్, ఆర్.ఓ. వాటర్ ప్లాంట్, ఫిజియోథెరపీ విభాగలను తనిఖీ చేశారు.సిబ్బంది ముఖ హాజరు సమయపాలన తనిఖీ చేశారు.ఆసుపత్రిలో శుభ్రత, పేషెంట్ల వైద్యం, వారి పర్యవేక్షణ, canteen , అన్ని విధాలా సక్రమంగా జరుగుతున్నట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గారిని అభినందించారు. అనంతరం ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది తో సమీక్షా సమావేశం నిర్వహించారు..ఈ. ఎస్. ఐ. లబ్ధిదారులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సుభాష్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, రోగులకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు ఇవ్వాలని, సిబ్బంది మధ్య నెలకొన్న అంతర్గత తార, తమ్య బేధ,భావాలను విడనాడి ఆసుపత్రి ని మరింత అభివృద్ధి చేయాలని డాక్టర్స్, సిబ్బందికి మంత్రి సూచించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి లో 15ఏళ్లకు పైగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది మంత్రి సుభాష్ కు వినతి పత్రం ఇస్తూ బీమా వైద్య శాఖ లో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వేడుకొన్నారు. అలాగే రెండు దశాబ్దాలుగా ఆసుపత్రి నే నమ్ముకొని పనిచేస్తున్న హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు పెంచాలని మంత్రి సుభాష్ కు విన్నవించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. ఎం. శ్యాంబాబు, ఆర్. ఎం. ఓ. డాక్టర్. ఎ. వి. ఎస్. ప్రసాద్, ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :