Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : ఈరోజు శ్రీకాళహస్తి మండలం అకూర్తి గ్రామం నందు యువ సమాజ్ నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు రాష్ట్ర అధ్యక్షులు తాళిక్కాల్ వెంకటేశ్వర్లు, వ్యవస్థాపకులు డాక్టర్ గానుగపెంట రమేష్ ల ఆధ్వర్యంలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా విద్యార్థులంతా కలిసి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ 13వ రోజు బాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో సంస్థ సభ్యులు,విద్యార్థులు ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండానికి భావితరాల మనుగడ కోసం మనకు ఉండాలి పాటించే దృఢ సంకల్పం అంటూ మొక్కలు నాటడం మా అందరి భాధ్యత సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే జూన్ 5న ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆరోజు నాటికి 2000 మొక్కలకు పైగా ప్రతిరోజూ సంస్థ సభ్యులు మరియు విద్యార్ధులంతా స్వచ్ఛందంగా పాల్గోని మొక్కలు నాటడానికి మేమందరం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చైతన్య, గురు కుమార్ మరియు విధ్యార్ధులు ఎకాంబరం,శశి కుమార్ పాల్గొన్నారు.అలాగే ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా వహించి మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
Admin
Famous TV