Famous TV - ఆంధ్రప్రదేశ్ / : ఎయిర్ పోర్ట్ నందు ముఖ్యమంత్రి గారి భద్రతపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పి శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., & జిల్లా కలెక్టర్ శ్రీ కె. వెంకటరమణ రెడ్డి ఐఎఎస్., జూన్ 4 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.వైయస్. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తిరుపతి విమానశ్రయనికి వచ్చి చిత్తూరు వెళ్లనున్న నేపద్యంలో ఆదివారం నాడు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు భద్రత పరమైన ముందస్తు ఏర్పాట్లపై (ASL) ను జిల్లా కలెక్టర్ శ్రీ కె. వెంకటరమణ రెడ్డి ఐఎఎస్.,గారు మరియు సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ.శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్., గారు జాయింట్ కలెక్టర్ బాలాజీ,ఐఎయస్.,వారు ఇతర శాఖల అధికారులతో రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు సమీక్ష నిర్వహించి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు.
సమీక్షలో ఉన్నతాదికారులు మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు.అలాగే గౌరవ సిఎం గారు తిరుగు ప్రయాణం అయ్యే వరకూ ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా గట్టి బద్రత కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ హౌస్, సేఫ్ హాస్పిటల్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ లు కులశేఖర్, విమల కుమారి, ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, ఏర్పోర్ట్ సిఎస్ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ కున్వర్ బహుదూర్, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, డిఎస్పీ లు భవ్య కిషోర్, యశ్వంత్, రవీంద్ర రెడ్డి, ఎంటిఓ రెడ్డప్ప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV