Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ అకస్మిక పర్యటన చేశారు.మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి, తమ శాఖల పనితీరుని అడిగి తెలుసుకున్నారు. అలాగే రెవిన్యూ శాఖలో ఎక్కువగా సమస్యలు ఉన్నాయని, వాటిని క్షేత్రస్థాయిలో సందర్శించి తగిన పరిష్కారం చూపాలని, తాహశిల్దార్ ను హెచ్చరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జలధార ప్రాజెక్ట్ ప్లానింగ్ విషయమై క్షేత్రస్తాయిలో పరిశీలన చేశారు.జిల్లాలోనే చౌడేపల్లి మండలంలో ఎక్కువగా చెరువులు ఉన్నాయని,వాటికి ఫీడర్ చానళ్ళు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలన చేశారు.ఫీడర్ చానల్ ను పరాశీలించి కాలువ గట్ల పై గల పిచ్చిమొక్కలను తొలగించాలని, వర్షాలు మొదలతే ఈ మొక్కలు, మట్టి తిరిగి కాలువలో చేరి వర్షపు నీరు ప్రవహించడం ఇబ్బందిగా ఉంటుందని అన్నారు.ప్రతి వర్షపు బొట్టును వడిసి పట్టుకొని, నీటి భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యం అని ఆయన అన్నారు.అలాగే మండలం లో గల ప్రధాన భూ సమస్యల పై వస్తున్న పిజిఆర్ఎస్ పిర్యాదులను ఏవిధంగా పరిశీలన చేసి, పరిష్కారం చూపుతున్నాని విచారణ చేశారు.రెండు మూడు సచివాలయాలలో సరిగా విచారణ చేయలేదని నిర్దారణ అయ్యిందిని అన్నారు.తర్వాత క్షేత్రస్తాయిలో దిగువపల్లి గ్రామపంచాయతీ లోగల శెట్టికుంటను సందర్శించారు. సదరు చెరువుకు గల సప్లై చానల్ ను సందర్శించారు.అనంతరం కాగతి గ్రామపంచాయతీ కాగతి చెరువును సందర్శించారు.భూసమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటిఃచి పరిష్కారం చూపాలని,భూ సమస్య పై సుదర్శన్ రెడ్డి అనే రైతు దారి విషయమై కలెక్టర్ కు విన్నవించగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కారం చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమఃలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి లిలామాధవి, తాహాశిల్దార్ పార్వతి, ఇరిగెషన్ ఏఈ నాగరాజు, డిఈ ఆర్డబ్యూఎస్ సురేష్, ఏఈ ఆర్డబ్యూఎస్ చందన, డిప్యూటీ ఎంపిడిఓ గఫూర్, డిప్యూటీ తాహాశిల్దార్ దొరస్వామి, దిగువపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, కాగతి విఆర్ఓ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV