Monday, 02 March 2026 12:26:32 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

వెలుగులు విరజిమ్మనున్న వెంకటగిరి

ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి పట్టణానికి సెంట్రల్ లైటింగ్ తో మరింత శోభ

Date : 15 September 2023 06:10 PM Views : 1733

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : వెంకటగిరి పట్టణం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-565 పై 2.450 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేసేందుకు నేషనల్ హైవే అథారిటీస్ టెండర్లు ఆహ్వానించింది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక శ్రద్ద, కృషితో రూ.1,41 కోట్ల నిధులను వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో గల ఈ జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కిమీ 480.690 నుండి కిమీ 483.140 వరకు "న్యూ మీడియన్ హైవే లైటింగ్" కోసం నిధులు మంజూరు చేస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ ఆఫీసర్ పనులు చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఇదివరకే వెంకటగిరి పట్టణంలో ఎంపీ మద్దిల గురుమూర్తి తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేసి ఎల్ఈడి కాంతులు నింపిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ స్థానిక నియోజకవర్గ ఇంచార్జి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో వెంకటగిరి మునిసిపాలిటీలో ఈ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు పలు మార్లు కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించామన్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పట్టణ సుందరీకరణ తోపాటుగా రోడ్డు ప్రమాదాల నివారించవచ్చని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు. ప్రస్తుతం ఈ పనులు చేపట్టేందుకు సహకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ గురుమూర్తి ధన్యవాదాలు తెలియజేసారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :