Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,పెద్దకొండా మర్రి గ్రామానికి చెందిన శ్రీనివాసులు (39) గుండెపోటుతో మరణించిన సంఘటన చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అతని భార్య ఏడాది క్రితం భర్తను వదిలేసి వెళ్లిపోవడంతో మనస్థాపంతో వేదన చెందుతుండేవాడని గ్రామస్తులు తెలియజేశారు.ఇంటి గుమ్మం ముందు ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు.అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. అతనికి ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె వికలాంగుడైన కుమారుడు కలిగి ఉన్నారు.తల్లి లేక తండ్రి కూడా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.ఈ విషయం తెలిసిన వెంటనే పుంగనూరు శాసన సభ్యులు,మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,చౌడేపల్లి మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి తో మాట్లాడి మృతుడి దహనసంస్కార నిమిత్తం ఆర్థిక సహాయం అందివ్వడంజరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు జంగాలపల్లి అగ్గిదేవర వెంకట్రమణ, సీనియర్ నాయకురాలు రుక్మిణమ్మ, ఓదులపేట సురేందర్ రెడ్డి, కాగతి సర్పంచ్ షంషీర్ బాషా,నాయకులు ఓబులేశు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV