Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : వినాయక చవితి సందర్భంగా పురస్కరించుకుని స్థానిక దాసరి మఠంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ నైనారు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం దాదాపు 500 మందికి పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నైనారు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి ఏడాది యువత వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో దాసరి మఠం యువత శ్రీ వినాయక చవితి పండుగను వేడుకగా గ్రామంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో మరింతమంది పేదలకు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యువ నేత మని, సతీష్ కేశవ వినోద్ రహీం స్థానిక ప్రజలు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Famous TV