Famous TV - ఆంధ్రప్రదేశ్ / : 28 వ భారత ప్రజా ఆరోగ్యం మరియు సోసియల్ ప్రెవేంటివ్ రాష్ట్ర సదస్సు 03 రోజులు గీతం వైద్య కళాశాల, గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం లో సెప్టెంబర్ 1 వ తారీకు నుండి 03 వరకు జరుగుతుంది అందులో పాల్గొన్న తిరుపతి ఎస్ వి వైద్య కళాశాల, ప్రజా సంబంధాల అధికారి, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ విభాగం, వైస్ ప్రెసిడెంట్ గా ఎనలేని సేవలు అందిస్తున్న వీరకిరణ్. ప్రజా ఆరోగ్యం పై రాష్ట్ర ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొని వస్తున్న సందర్బంగా, వైద్యలు, ఆయుర్వేదిక్ హెర్బల్ రీసెర్చ్, సోసియల్ సైంటిస్ట్లు , నర్సింగ్, మరియు పారామెడికల్ పాత్ర ప్రజా ఆరోగ్యం కాపాడడంలో ఎంతైనా అవసరం ఉందని వీర కిరణ్ సదస్సులో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన విలేజ్ హెల్త్ క్లినిక్స్ కాన్సెప్ట్ చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలిపారు. రాబోవు రోజుల్లో ప్రజారోగ్యం పై పరిశోధనలు జరిపి మెరుగైన వైద్యం అందించడానికి. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలని, సదస్సుకు విచ్చేసిన వక్తలు ప్రసంగించారు. అందులో భాగంగానే ఆయుష్మాన్ భారత్, భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం, ప్రెసిడెంట్ శ్రీ భరత్ ముత్తుకు మిల్లి, గీతం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతి పద్మజ, డాక్టర్ అప్పలనాయుడు ప్రెసిడెంట్, ఐ.పి.హెచ్. ఎ, డాక్టర్ కేకే ఎల్. ప్రసాద్, జనరల్ సెక్రెటరీ, ఐ.పి.హెచ్.ఏ. ఆర్గనైజింగ్ సెక్రెటరీ డాక్టర్ నాగమణి, కోశాధికారి డాక్టర్ గంటా శ్రీనివాస్, పద్మావతి మహిళా వైద్య కళాశాల తిరుపతి, సామాజిక వైద్య విభాగం నుండి డాక్టర్ రవి శంకర్, డాక్టర్ చంద్రశేఖర్, ఉప్పాడ నుండి డాక్టర్ హరినాథ్ రాజా, డాక్టర్ మురళీమోహన్, యూజీ,పిజి, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి రాష్ట్ర సదస్సు 2024 ఎస్వీ వైద్య కళాశాల సామాజిక వైద్య విభాగం నందు జరుగునని తీర్మానం చేయబడినది.
Admin
Famous TV