Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : ఏడు సంవత్సరాల నుండి భూ వివాదం చౌడేపల్లి ఫేమస్ టివి న్యూస్ : చిత్తూరు జిల్లా, చౌడేపల్లి మండలం లోని కాగితి గ్రామపంచాయతీ కాగితి రెవిన్యూ పైకి సర్వేనెంబర్ 316/4,316/1 రెడ్డెప్ప కు, సరస్వతమ్మ కు భూ వివిదం నడుస్తుంది. ఐతే ఈ వివాదం గత ఏడు సంవత్సరాల నుండి నడుస్తుంది. నాలుగుసార్లు సర్వే చేసి సదరు భూమి రెడ్డెప్పకు చెందినదని చెప్పడం జరిగింది.ఐతే సరస్వయమ్మ తరపున వాళ్ళు సదరు భూ సమస్య పైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పుంగనూరు లో దావాకూడా వేశారు. ఐతే సర్వేనెంబర్లు ఎక్కడెక్కడ ఎవరివి వస్తాయో చూపడం లో సర్వేయర్లు విఫలమౌతున్నారు. అంతే కాకుండా భూములకు సంబందించిన రికార్డులు కూడా యమ వద్ద లేవని, నిర్లక్ష్యం గా సమాధానం చెప్తున్నారు. అసైన్మెంట్ భూములు పట్టాలిచ్చినప్పుడు అసైన్మెంట్ ఫైలు, సర్వేయర్ స్కెచ్, గ్రామపంచాయతీ నోటీసు బోర్డు లో నోటీసు అంటించడం, ఎవరికైనా ఆక్షేపణలు ఉన్నాయని తెలుసుకొని, సదరు భూమి ఎవరి ఆధీనంలో, అనుభవం లో లేకపోతే పట్టా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకే భూమిని ఏవిధంగా పట్టాలు ఇస్తారు. అలా ఇచ్చిన పట్టాల పై గల ఏ. యం నెంబర్లు, పసళీలు చూస్తూ ఎవరికి ముందు పట్టాఇచ్చారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో బుదవారం 316 సర్వేనెంబర్ సర్వేచేయడానికి వచ్చిన అధికారులు ఎటువంటి గొలుసు, ఫోర్ రిజిస్టర్, రికార్డులు తీసుకొని రాకుండా చేతులు ఊపుకుంటూ వచ్చి ఇరుపక్షాలను ఇబ్బంది పెట్టారు. అసలు ఫోర్ రిజిస్టర్ రెవిన్యూ కార్యాలయం లో లేదంటే రెవిన్యూ సిబ్బంది తమ విధినిర్వహణ లో ఎంతటి ఉదారస్వభావంతో పనిచేస్తున్నారో, వారి విధి నిర్వహణ లో జవాబుదారితనం, పారదర్శకత ఎలా ఉందో అర్థమౌతుంది. కావున ఉన్నతాధికారులు వెంటనే కలుగజేసుకొని రికార్డులు లేకుండా విధులు నిర్వహిస్తున్న అధికారుల పై శాఖాపరమైన చర్యలు తీసుకొని, వెంటనే సదరు భూ సమస్యను పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుచున్నారు.
Admin
Famous TV