Friday, 19 June 2026 01:40:23 PM
# భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన

"జగనన్న ఆణిముత్యాలు" పేరిట ప్రోత్సాహకాలు

అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

Date : 15 June 2023 05:58 PM Views : 730

Famous TV - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, "జగనన్న ఆణిముత్యాలు" పేరిట ప్రోత్సాహకాలు అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రధమ ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించిన మంత్రి కాకాణి. మంత్రి కాకాణి మాట్లాడుతూ.. 2006 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యపై పెట్టే ప్రతి రూపాయి భావి తరాల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడిగా భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు అవసరమైన వస్తువులను అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు పెద్ద పీట వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న నాడు- నేడు పథకాన్ని దేశం మొత్తం మీద ఆచరించేందుకు సిద్ధపడుతుంది. పిల్లలు చదువుతో పాటు విలువలను కూడా అలవర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు, కార్పోరేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు ధీటుగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. విద్యార్థులు స్వతహాగా స్వీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. విద్యార్థులందరూ తమ తల్లితండ్రులు గర్వపడేలా ఉత్తమ స్థాయికి చేరుకోవాలి. తల్లితండ్రులు విద్యార్థుల ఆసక్తిని తెలుసుకొని, ప్రోత్సహించాలి. విద్యార్థులందరూ బాగా చదివి, సర్వేపల్లి నియోజకవర్గానికి మంచి పేరు వచ్చేలా ఎదగాలి.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :