Famous TV - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : ఫేమస్ టీవి న్యూస్: జాతీయ బిసి బహుజన ఫ్రంటు అధ్యక్షులు తాటికొండ నరసింహారావు బడుగు బలహీన వర్గాల మహిళలపై ఆధునిక యుగంలో కూడా దాడులు హత్యలు అత్యాచారయత్నాలు జరుగుతూనే ఉన్నాయని ఇవన్నీటిని అరికట్టాలి అంటే కచ్చితంగా బడుగు బలహీన వర్గాల మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని జాతీయ బి సి బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ని కలిసి వినతిపత్రం అందజేయడమైనది. ఈ సందర్భంగా తాటికొండ నరసింహారావు మాట్లాడుతూ కొంతకాలంగాగత ప్రభుత్వం లొ బడుగు బలహీన వర్గాల మహిళలపై దాడులు పెరిగాయని అసమానతలు వివక్షతలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయని బడుగు వర్గాల మహిళలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉందని తెలిపారు. 33% గా ఉన్నటువంటి మహిళలు రాజకీయంగా సామాజికంగా ఎంతో వెనుకబాటు తనానికి గురవుతున్నారని నామినేటెడ్ పదవుల్లో సైతం బలహీన వర్గాల మహిళలకు ప్రాతినిత్యం కల్పించాలని నరసింహారావు కోరారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందిస్తూ బలహీనవర్గాల మహిళలకు ప్రాతినిత్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సిఫార్సు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో తన్నీరు సాంబయ్య వి విజయలక్ష్మి వున్నారు
Admin
Famous TV