Monday, 02 March 2026 12:22:02 PM
# కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు # భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర # వేట కొడవలితో అక్కపై తమ్ముడు దాడి.. పరిస్థితి విషమం # నకిలీ సర్టిఫికెట్ తో ఉపాధ్యాయ ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలి కార్డ్స్ వ్వవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్ # పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం # బోయకొండలో డిఐజీ అకస్మిక పర్యటన # 12వ పిఆర్సి కమిషన్ ను ఏర్పాటు చేయాలని తాహశిల్దార్ వినతి పత్రం # పుంగనూరు రూరల్ సర్కిల్ ఇన్పెక్టర్ గా సాయి ప్రసాద్ # అనుమానమే ఆ ఇల్లాలిపాలిట శాపమైనదా # నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను నియంత్రించి రెవెన్యూ లక్ష్యాలను పెంచాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు పొందిన ఏఎస్పీ రాజశేఖర్ రాజు

భక్తుల పై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు - మదనపల్లి డిఎస్పి మహేంద్ర

Date : 04 February 2026 08:23 PM Views : 438

Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,బోయకొండ గంగమ్మ భక్తులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి డిఎస్పి మహేంద్ర తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం రోజు ఓ మహిళ భక్తురాలపై సుమో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించి దౌర్జన్యం చేసిన విషయం పై బుదవారం చౌడేపల్లి సర్కిల్ పోలీస్ ఆఫీస్ నందు బోయకొండలో మాంసం కటింగ్, సుమో డ్రైవర్లు, ఆటోల డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది.బోయకొండ గంగమ్మ భక్తులపై గాని మహిళా భక్తులపై గాని చిన్న పిల్లలపై గాని ఎలాంటి గలాటాలు దౌర్జన్యాలు అసభ్యకర ప్రవర్తనలు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.బోయకొండకు భక్తులు వస్తేనే అక్కడ ఉన్నవారికి జీవనోపాధి ఆదాయాలు ఉంటాయి కాబట్టి భక్తులపై గౌరవంగా మర్యాదగా నడుచుకోవాలని అవగాహన కల్పించారు.ప్రతి సుమో డ్రైవర్ ఆటో డ్రైవర్ మాంసం కటింగ్ చేసేవారు వారి ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ ను తీసుకున్న వారు మాత్రమే బోయకొండలో మాంసం కటింగ్ చేసుకోవాలని ఆటోలు సుమోలు నడుపుకోవాలని ఆదేశించారు.అలాగే మహిళపై అత్యాయత్నం కూడా జరగడంతో వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.మద్యం సేవించి ఆటోలు సుమోలు నడపడం బోయకొండలో విధులు నిర్వహించడం వ్యాపారాలు చేయడం చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తీవ్రంగా హెచ్చరించారు.స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు మటన్ కటింగ్ చేసేవారు ప్రతి ఒక్కరూ భక్తులను మహిళలను చిన్నపిల్లలను గౌరవించడం సాంప్రదాయంగా ఉండాలని సూచించారు.ఆలయ ప్రతిష్ట దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలయ ప్రతిష్ట పెంపొందించాలని సూచించారు అలాకాకుండా ఎలాంటి దౌర్జన్యాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ ,ఎస్సై నాగేశ్వరరావు ఉన్నారు.

Vuttaradi Hariprasad

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :