Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం,బోయకొండ గంగమ్మ భక్తులపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి డిఎస్పి మహేంద్ర తీవ్రంగా హెచ్చరించారు. ఆదివారం రోజు ఓ మహిళ భక్తురాలపై సుమో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించి దౌర్జన్యం చేసిన విషయం పై బుదవారం చౌడేపల్లి సర్కిల్ పోలీస్ ఆఫీస్ నందు బోయకొండలో మాంసం కటింగ్, సుమో డ్రైవర్లు, ఆటోల డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది.బోయకొండ గంగమ్మ భక్తులపై గాని మహిళా భక్తులపై గాని చిన్న పిల్లలపై గాని ఎలాంటి గలాటాలు దౌర్జన్యాలు అసభ్యకర ప్రవర్తనలు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.బోయకొండకు భక్తులు వస్తేనే అక్కడ ఉన్నవారికి జీవనోపాధి ఆదాయాలు ఉంటాయి కాబట్టి భక్తులపై గౌరవంగా మర్యాదగా నడుచుకోవాలని అవగాహన కల్పించారు.ప్రతి సుమో డ్రైవర్ ఆటో డ్రైవర్ మాంసం కటింగ్ చేసేవారు వారి ఆధార్ కార్డు ఫోటో ఫోన్ నెంబర్లు పోలీస్ స్టేషన్లో ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ ను తీసుకున్న వారు మాత్రమే బోయకొండలో మాంసం కటింగ్ చేసుకోవాలని ఆటోలు సుమోలు నడుపుకోవాలని ఆదేశించారు.అలాగే మహిళపై అత్యాయత్నం కూడా జరగడంతో వారిని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.మద్యం సేవించి ఆటోలు సుమోలు నడపడం బోయకొండలో విధులు నిర్వహించడం వ్యాపారాలు చేయడం చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని తీవ్రంగా హెచ్చరించారు.స్థానికంగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు మటన్ కటింగ్ చేసేవారు ప్రతి ఒక్కరూ భక్తులను మహిళలను చిన్నపిల్లలను గౌరవించడం సాంప్రదాయంగా ఉండాలని సూచించారు.ఆలయ ప్రతిష్ట దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలయ ప్రతిష్ట పెంపొందించాలని సూచించారు అలాకాకుండా ఎలాంటి దౌర్జన్యాలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ ,ఎస్సై నాగేశ్వరరావు ఉన్నారు.
Admin
Famous TV