Famous TV - ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు : చౌడేపల్లి ఫేమస్ టీవి న్యూస్ : మండలం లోని తాహాశిల్దార్ కార్యాలయం ను రెవిన్యూ డివిజినల్ అధికారిణి భవాణి అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆవిడ మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా ఇప్పటి వరకు 15 రెవిన్యూ గ్రామాలకు గాను రెండు రెవిన్యూ గ్రామాలు రీ సర్వే పూర్తి అయ్యిందని, అలాగే సెప్టెంబర్ 8 నుండి మొదటగా రెవిన్యూ గ్రామాల సరిహద్దులు సర్వేచేస్తామని, తర్వాత ప్రభుత్వ భూములను సర్వేచేస్తామని, పట్టాభూమి, అంతే కాకుండా ముఖ్యంగా చాలా వరకు చెరువులు ఆక్రమణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినదని, అటువంటి వాటిని పూర్తిగా తొలగించడం జరుగుతుందని తెల్పారు. చౌడేపల్లి పట్టణంలో బిసి కాలనీ, జూనియర్ కళాశాల, శ్రీనివాస సినిమా థియేటర్ ప్రాంతంలో రాజుకాలవలను పూడ్చడం వలన కొద్దిపాటి వర్షానికే జలమయమై ఇండ్లలోకి మురికినీరు చేసి, పాములు, కప్పలతో జీవనం సాగిస్తున్నారని తెల్పగా సదరు సమస్యపై వెంటనే దృష్టి సారించాలని తాహశిల్దార్ పార్వతిని ఆర్. డి. ఒ భవాని హెచ్చరించారు. అనంతరం రెవిన్యూ సిబ్బంది తో సమావేశం ఏర్పాటుచేసుకొని రీ సర్వేపైన చర్చించడం జరిగింది.
Admin
Famous TV