Famous TV - ఆంధ్రప్రదేశ్ / అన్నమయ్య ( రాయచోటి ) : అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాగితి గ్రామపంచాయతీ యనమసామనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రీమియం కోళ్ళ కంపెనీ నుండి వస్తున్న దుర్వాసన,ఈగలు పై సదరు కంపెనీ వారు ప్రజారోగ్యం పై సరైన చర్యలు చేపట్టకపోవడం, మరియు సదరు ప్రీమియం కంపెనీ వలన దాదాపు మూడు కిలోమీటర్లు వరకు ఈగలు వ్యాప్తి చెంది ఎక్కడ పడితే అక్కడ ఈగల వలన భోజనం చేయాలంటే కూడా దోమతెరలు కట్టుకొని తినే పరిస్థితులు ఎర్పడ్డాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అంటూ ఆయన మాట్లాడినారు.ఐతే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల భవిష్యత్ మారడంలేదంటే పరిస్థితి చూడండి. కావున గత ప్రభుత్వం ఎలాగో ప్రజలగోడు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం ఐనా ప్రజల గోడు పట్టించుకొని, శాశ్వత పరిష్కారం చూపితే బాగుంటుందని ఆయన అన్నారు.అందుకోసరమే ప్రీమియం కంపెనీ పైన ప్రజా సమస్యల పరిష్కార వేధికలో ఆన్లైన్ లో పిర్యాదు చేయడం జరిగిందని ఆయన వాపోయాడు. పిజిఆర్ఎస్ నెంబర్ సిటిఆర్20260118150 గా నమోదు చేసి పరిష్కారం కొరకు డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కు పంపినట్లు తనకు మెసేజ్ వచ్చిందని ఉత్తరాది హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున వెంటనే సంబదిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
Admin
Famous TV