Famous TV - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : తిరుపతిలో పెట్టుబడులపై యూకె ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకనమి అడ్వైజరి నళిని రఘరామన్, డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ వరుణ్ మాలితో ఈరోజు ప్రత్యేక సమావేశం జరిగింది. తిరుపతిలో ప్రాజెక్టులు నిర్మించేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, యూకె పెట్టుబడులు పెట్టేందుకు తిరుపతిని పరిశీలించాలని ఆయనను కోరడం జరిగింది. నగరంలో అభివృద్ధి నిర్మాణ పనులు కోసం యూకే ప్రాజెక్టలను ఆహ్వానిస్తున్నట్లు, ప్రాజెక్టుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను తిరుపతి నగర పాలక సంస్థ అందిస్తుందని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డెలిగేట్స్ కు నగరాభివృద్ధిని చూపించడం జరిగింది. ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మాస్టర్ ప్లాన్ రోడ్లు, మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థ, 80 శాతం మురుగునీరు శుద్ధి వంటి ఎన్నో అద్భుత కార్యక్రమాలతో తిరుపతి అభివృద్ది సరవేగంగా జరుగుతుందని వారికి వివరించడం జరిగింది. అంతే కాకుండా తిరుపతిలో ప్రాజెక్టులు పెట్టేందుకు రహదారులు, రైల్వే, ఏయిర్ పోర్ట్ అతి దగ్గరలో అందుబాటులో ఉన్న విషయాన్ని తెలిపి ప్రాజెక్టులను నెలకొల్పెందుకు అనువైన ప్రదేశంగా వారికీ వివరించడంతో వారు సానుకూలంగా స్పందించడం చాల సంతోషకరమైన విషయం. టెంపుల్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు యూకే కూడా ఆసక్తిగా ఉందని యూకె ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలపడం అభివృద్ధి పదంలో తిరుపతి మరో ముందడుగు వేసిందని చెప్పటానికి గర్వంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో కమిషనర్ శ్రీమతి డి. హరిత ఐఏఎస్ గారు, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహాచారి, లడ్డు భాస్కర్ రెడ్డి, నరేంధ్రనాధ్, ఇమామ్ సాహెబ్, జెసిఎస్ అధ్యక్షులు బాలిశెట్టి కిశోర్, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Famous TV