Sunday, 19 April 2026 05:34:05 PM
# చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం # తల రాతను మార్చలేం కానీ.. తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చు. # వాల్టా ఆక్ట్ ఉల్లంగణ # ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు # తప్పు ఎవరిది? అధికారులదా? ప్రభుత్వానిదా? సామాన్యులు ఈ తప్పు చేసి ఉంటే ఈ పాటికి కటకటాలే # లోక్ అదాలత్ లో 416 కేసులు పరిష్కారం # దళిత జర్నలిస్టుపై దాడి - తీవ్రంగా ఖండించిన సీనియర్ జర్నలిస్టు టి.మునిరత్నం # మహిళా శిరోమణి అవార్డు అందుకున్న ఉత్తరాది గీత # పలమనేరు అమ్మాయికి సివిల్స్ లో 360వ ర్యాంకు # కాకినాడ బాణసంచా పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరం* # రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వుందా..? లేదా..? ఫారెస్ట్ అధికారులకు హైకోర్టు అక్షింతలు...!! # బంగారు కడ్డీలు ఆశచూపి పదైదు లక్షలతో ఉడాయింపు శివమొగ్గలో ప్రారంభమైన కథ లద్దిగం వద్ద ముగిసినది # మానవ మృగాన్ని నడిరోడ్డు పై శిక్షించాలి - కార్డ్స్ సంస్థ అధ్యక్షురాలు ఉత్తరాది గీత # జిల్లా స్థాయి చెస్ పోటీల లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి స్వర్ణ పతకం సాధించిన చిన్నారి మేధస్వి # పుంగనూరు టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు మధుసూదన్ నాయుడు పర్యటన.. # భక్తులతో పోటెత్తిన బోయకొండ భక్తుల సౌకర్యాలు దగ్గరుండి పరివేక్షించిన ఉపకమీషనర్ ఏకాంబరం # రోడ్లపైనే వాహనాలు - ప్రమాదం జరిగితే ఎలా? బోయకొండలో పుట్ పాత్ ఆక్రమణ # లక్షకుంకుమార్చన అత్యంత వైభవం గా మూడవరోజు పూజా కార్యక్రమం # కోడి పందాల స్థావరం పై మెరుపుదాడి 13 మంది అరెస్టు

రుయా ఆస్పత్రి కి పీపుల్స్ చారిటీ సామాజిక సేవ

Date : 18 December 2023 05:53 PM Views : 647

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : సోమవారం రుయా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న రోగులకు సంబంధించిన మంచాలు, వీల్చార్లు, సెలైన్స్ స్టాండ్లను, స్ట్రక్చర్లు, అంటే ఖరీదైన వస్తువులన్నీ మూలన పడేసిన వాటిని చూసి పీపుల్స్ చారిటీ తిరుపతి వారు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ను సంప్రదించినారు. ఐ సి యు మంచాలకు వీటికి కావలసిన వీల్ చక్రాలు, పెయింటింగ్, టింకరింగ్, వర్క్ లన్ని కూడా మా ట్రస్టు ద్వారా రుయా హాస్పిటల్ కి రిపేరు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, దృక్పథంతో ఈరోజు సామాజిక సేవలో మా పాత్ర అంటూ పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ముందుకు రావడంతో జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జి.రవి ప్రభు సూపరిటెండెంట్ మాట్లాడుతూ, మొదటిగా పీపుల్స్ చారిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మొదటి దశ పనులుగా దాదాపు 14 ఐసీయూ మంచాలు,10 స్ట్రక్చర్లు ,10 వీల్ చైర్లు, దాదాపు 40 ఐ వి స్టాండ్లు , మొదటి దిశ పనులుగా పూర్తి చేసి ఇవ్వడం జరిగినది. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఈరోజు సుమారు లక్ష రూపాయలు ఖర్చ తో ఈ పనులన్నీ పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వస్తువులన్నీ కొత్తగా కొనాలంటే దాదాపు 50 నుండి 60 లక్షలు ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి దాతలు ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించినట్లయితే పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చుని అన్నారు. పీపుల్స్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో రుయా ఆసుపత్రిలో నిరుపకంగా ఉన్న కొన్ని పరికరాల్ని , వస్తువులను, సేకరించి రెండోదప్ప పనులుగా అన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామన్నారు. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఎప్పుడు రుయా ఆసుపత్రి సేవలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఏ.ఆర్.ఎం.ఓ.డాక్టర్ హరికృష్ణ, ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కె ఆర్ ప్రకాష్, లక్ష్మీనారాయణ ఎమ్మెన్వో, మరియు ఎస్ వి.వైద్య కళాశాల పి.ఆర్.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :