Famous TV - ఆంధ్రప్రదేశ్ / : సోమవారం రుయా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న రోగులకు సంబంధించిన మంచాలు, వీల్చార్లు, సెలైన్స్ స్టాండ్లను, స్ట్రక్చర్లు, అంటే ఖరీదైన వస్తువులన్నీ మూలన పడేసిన వాటిని చూసి పీపుల్స్ చారిటీ తిరుపతి వారు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ను సంప్రదించినారు. ఐ సి యు మంచాలకు వీటికి కావలసిన వీల్ చక్రాలు, పెయింటింగ్, టింకరింగ్, వర్క్ లన్ని కూడా మా ట్రస్టు ద్వారా రుయా హాస్పిటల్ కి రిపేరు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, దృక్పథంతో ఈరోజు సామాజిక సేవలో మా పాత్ర అంటూ పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ముందుకు రావడంతో జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జి.రవి ప్రభు సూపరిటెండెంట్ మాట్లాడుతూ, మొదటిగా పీపుల్స్ చారిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మొదటి దశ పనులుగా దాదాపు 14 ఐసీయూ మంచాలు,10 స్ట్రక్చర్లు ,10 వీల్ చైర్లు, దాదాపు 40 ఐ వి స్టాండ్లు , మొదటి దిశ పనులుగా పూర్తి చేసి ఇవ్వడం జరిగినది. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఈరోజు సుమారు లక్ష రూపాయలు ఖర్చ తో ఈ పనులన్నీ పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వస్తువులన్నీ కొత్తగా కొనాలంటే దాదాపు 50 నుండి 60 లక్షలు ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి దాతలు ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించినట్లయితే పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చుని అన్నారు. పీపుల్స్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో రుయా ఆసుపత్రిలో నిరుపకంగా ఉన్న కొన్ని పరికరాల్ని , వస్తువులను, సేకరించి రెండోదప్ప పనులుగా అన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామన్నారు. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఎప్పుడు రుయా ఆసుపత్రి సేవలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఏ.ఆర్.ఎం.ఓ.డాక్టర్ హరికృష్ణ, ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కె ఆర్ ప్రకాష్, లక్ష్మీనారాయణ ఎమ్మెన్వో, మరియు ఎస్ వి.వైద్య కళాశాల పి.ఆర్.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV