Wednesday, 29 July 2026 01:06:02 AM
# మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం! # స్పందనలో స్పందన కరువా?" # చిన్నపిల్లల విషయంపై వివాదం.. ఇద్దరిపై దాడి చేసినట్లు ఆరోపణ # నకిలీ నారతో నష్టపోయిన రైతు - ఆత్మహత్యే శరణ్యం అంటన్న రైతు # భారీ ఎత్తున నిషేధిత గుట్కాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు # భక్తులతో పోటెత్తిన బోయకొండ # చల్లాబాబు సుడిగాలి పర్యటన విజయవంతం # 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి కి ఓటు హక్కు కల్పించాలి # వైష్ణవి దేవి ఆలయంలో పౌర్ణమి సందర్బంగా ప్రత్యేక పూజలు # అర్జీ నుంచి పరిష్కారం వరకు… ప్రజలకు భరోసా కల్పించాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అనాద శవానికి అంత్యక్రియలు చేసిన పోలీసులు # సదుం మండలంలో పెద్దిరెడ్డి రాజ్యాంగం కూటమినాయకులకు సంకటం # ఎడ్విన్’ పేరుతో అమెరికా డాక్టర్ నంటూ సైబర్ వల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ.21 లక్షల కుచ్చుటోపీ # మైనర్ బాలికపై అత్యాచారం: నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష # జస్టీస్ పున్నయ్య కమిషన్ సిఫారుస్సులు అమలెక్కడ? # భక్తులతో పోటెత్తిన బోయకొండ మొరాయించిన కంప్యూటర్లు,ప్రత్యేక దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న భక్తులు # అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

రుయా ఆస్పత్రి కి పీపుల్స్ చారిటీ సామాజిక సేవ

Date : 18 December 2023 05:53 PM Views : 719

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : సోమవారం రుయా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న రోగులకు సంబంధించిన మంచాలు, వీల్చార్లు, సెలైన్స్ స్టాండ్లను, స్ట్రక్చర్లు, అంటే ఖరీదైన వస్తువులన్నీ మూలన పడేసిన వాటిని చూసి పీపుల్స్ చారిటీ తిరుపతి వారు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ను సంప్రదించినారు. ఐ సి యు మంచాలకు వీటికి కావలసిన వీల్ చక్రాలు, పెయింటింగ్, టింకరింగ్, వర్క్ లన్ని కూడా మా ట్రస్టు ద్వారా రుయా హాస్పిటల్ కి రిపేరు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, దృక్పథంతో ఈరోజు సామాజిక సేవలో మా పాత్ర అంటూ పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ముందుకు రావడంతో జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జి.రవి ప్రభు సూపరిటెండెంట్ మాట్లాడుతూ, మొదటిగా పీపుల్స్ చారిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మొదటి దశ పనులుగా దాదాపు 14 ఐసీయూ మంచాలు,10 స్ట్రక్చర్లు ,10 వీల్ చైర్లు, దాదాపు 40 ఐ వి స్టాండ్లు , మొదటి దిశ పనులుగా పూర్తి చేసి ఇవ్వడం జరిగినది. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఈరోజు సుమారు లక్ష రూపాయలు ఖర్చ తో ఈ పనులన్నీ పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వస్తువులన్నీ కొత్తగా కొనాలంటే దాదాపు 50 నుండి 60 లక్షలు ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి దాతలు ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించినట్లయితే పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చుని అన్నారు. పీపుల్స్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో రుయా ఆసుపత్రిలో నిరుపకంగా ఉన్న కొన్ని పరికరాల్ని , వస్తువులను, సేకరించి రెండోదప్ప పనులుగా అన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామన్నారు. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఎప్పుడు రుయా ఆసుపత్రి సేవలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఏ.ఆర్.ఎం.ఓ.డాక్టర్ హరికృష్ణ, ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కె ఆర్ ప్రకాష్, లక్ష్మీనారాయణ ఎమ్మెన్వో, మరియు ఎస్ వి.వైద్య కళాశాల పి.ఆర్.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :