Saturday, 13 June 2026 10:51:45 AM
# అధిక వడ్డీకి ఆశపడి ఖాళీ ప్రామిసరీ నోట్ల పై సంతకాలు # సంజీవిని అభా సర్వేచేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలు # అత్యదిక రోజులు ప్రధాన మంత్రిగా పనిచేసిన మోదీ నెహ్రూ రికార్డు బద్ధలు కొట్టిన మోదీ # పారదర్శకంగా.. తప్పులు లేకుండా "సర్" ప్రక్రియ నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ # కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తహసీల్దార్ మాధవి # కిడ్స్ బాట్మెంటన్ టోర్నమెంట్ నిర్వహించిన ఎల్ ఆర్ అకాడమి # అమ్మపేరుతో ఒక మొక్క నాటుదాం # పందిళ్ళపల్లిలో పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం # పిజిఆర్ఎస్ పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఎక్కడ? - ఉత్తరాది హరిప్రసాద్ # పట్టణ నడిబొడ్డున...పట్టపగలు కోట్ల విలువ చేసే భూమి ఆక్రమణకు యత్నం # ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి.. # ఎంత చిత్రం.. రాత్రి ఏమో మామిడికాయలు.. తెల్లారేసరికి పండ్లు.. # స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు # మహిళల భద్రతపై ప్రజలలో భద్రతా అంశాలపై అవగాహన # టీడీపీ కార్యకర్త వెంకటేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన గువ్వల రమేష్ రెడ్డి # ఆటోబోల్తా ముగ్గురికి గాయాలు # మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లడం నాగరిక సమాజానికే సిగ్గుచేటు – # బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి.. సత్వర న్యాయం అందించాలి.. # చౌడేపల్లిలో కలెక్టర్ అకస్మిక పర్యటన, క్షేత్రస్థాయిలో చెరువులను సందర్శన # ఘనంగా వీడ్కోలు సమావేశం

రుయా ఆస్పత్రి కి పీపుల్స్ చారిటీ సామాజిక సేవ

Date : 18 December 2023 05:53 PM Views : 670

Famous TV - ఆంధ్రప్రదేశ్ / : సోమవారం రుయా ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న రోగులకు సంబంధించిన మంచాలు, వీల్చార్లు, సెలైన్స్ స్టాండ్లను, స్ట్రక్చర్లు, అంటే ఖరీదైన వస్తువులన్నీ మూలన పడేసిన వాటిని చూసి పీపుల్స్ చారిటీ తిరుపతి వారు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.రవి ప్రభు ను సంప్రదించినారు. ఐ సి యు మంచాలకు వీటికి కావలసిన వీల్ చక్రాలు, పెయింటింగ్, టింకరింగ్, వర్క్ లన్ని కూడా మా ట్రస్టు ద్వారా రుయా హాస్పిటల్ కి రిపేరు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, దృక్పథంతో ఈరోజు సామాజిక సేవలో మా పాత్ర అంటూ పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ముందుకు రావడంతో జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ జి.రవి ప్రభు సూపరిటెండెంట్ మాట్లాడుతూ, మొదటిగా పీపుల్స్ చారిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మొదటి దశ పనులుగా దాదాపు 14 ఐసీయూ మంచాలు,10 స్ట్రక్చర్లు ,10 వీల్ చైర్లు, దాదాపు 40 ఐ వి స్టాండ్లు , మొదటి దిశ పనులుగా పూర్తి చేసి ఇవ్వడం జరిగినది. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఈరోజు సుమారు లక్ష రూపాయలు ఖర్చ తో ఈ పనులన్నీ పూర్తి చేసి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ వస్తువులన్నీ కొత్తగా కొనాలంటే దాదాపు 50 నుండి 60 లక్షలు ఖర్చు అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి దాతలు ప్రభుత్వ ఆసుపత్రికి సహాయ సహకారాలు అందించినట్లయితే పేదలకు మెరుగైన వైద్యం అందించవచ్చుని అన్నారు. పీపుల్స్ ట్రస్ట్ వారు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో రుయా ఆసుపత్రిలో నిరుపకంగా ఉన్న కొన్ని పరికరాల్ని , వస్తువులను, సేకరించి రెండోదప్ప పనులుగా అన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామన్నారు. పీపుల్స్ చారిటీ తిరుపతి వారు ఎప్పుడు రుయా ఆసుపత్రి సేవలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఏ.ఆర్.ఎం.ఓ.డాక్టర్ హరికృష్ణ, ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కె ఆర్ ప్రకాష్, లక్ష్మీనారాయణ ఎమ్మెన్వో, మరియు ఎస్ వి.వైద్య కళాశాల పి.ఆర్.ఓ.వీర కిరణ్ పాల్గొన్నారు.

Famous Tv

Admin

Famous TV

మరిన్ని వార్తలు

Copyright © Famous TV 2026. All right Reserved.



Developed By :