Famous TV - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల లో ఫారెన్సిక్ మెడిసిన్ వైద్య విభాగముందు ఈరోజు డాక్టర్ వైయస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వారిచే సూచించబడిన "నిరంతర వైద్య విద్య" కార్యక్రమం జరిగినది. ఇందులో కర్నూలు,కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి మరియు అనంతపురం, జిల్లాలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, మరియు ప్రైవేటు వైద్య కళాశాల యందున్నటువంటి ఫోరెన్సిక్ మెడిసిన్, విభాగము పీజీ వైద్య విద్యార్థులు గైనకాలజీ డిపార్ట్మెంట్కు చెందిన పీజీలు అధ్యాపకులు సైకియాట్రి డిపార్ట్మెంట్కు చెందిన పీజీలు అధ్యాపకులు, జోనల్ స్థాయిలో తెలిపిన వైద్య కళాశాలలు వైద్య విద్యార్థులు అధ్యాపకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లైంగిక సమస్యలు వంధత్వము, నపుంసకత్వం, ఆధునిక పద్ధతుల ద్వారా సంతానం పొందడం, సరోగసి అద్దె గర్భము వంటి అంశాల మీద విస్తృతమైన బోధన జరిగినది. దీని వలన ప్రజలలో ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ అంశం పైన వైద్యులలో వైద్య విద్యార్థులలో అవగాహన పెరగడం ద్వారా సంఘంలో మంచి వైద్యులుగా నిలబడగలరు. చట్టపరిధులలో వారు ఏమి చేయగలరో, లైంగిక సమస్యల నుండి బయటపడటానికి వైద్యులు అవలంబించవలసిన పద్ధతులు, చట్టం పరిధిలో వైద్యులు చేయగలిగిన, చేయవలసిన, పరీక్షలు వాటి గురించి అవగాహన పెరగడం వల్ల ఈ రకమైన సమస్యలతో బాధపడుతున్న బయటికి చెప్పుకోలేని అనేకమంది మానసిక శారీరక రోగాలకు వైద్యము ఉపశమనం కలిగే అవకాశం పెరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో ఎస్ వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్,) డాక్టర్ వెంకటేశ్వర్లు వైస్ ప్రిన్సిపాల్ (అడ్మిన్ ), రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, ఫోరెన్సిక్ మెడిసన్ విభాగపు అధిపతి డాక్టర్ శశికాంత్ కార్యక్రమం ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ సేపూరి రామ్మోహన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగళూరు నుండి వైజాగ్ నుండి వచ్చినటువంటి ప్రొఫెసర్లు స్థానికంగా ఉన్నటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఈరోజు జరుగుతున్న "మెడికల్ లీగల్ ఆస్పెక్ట్స్ ఇన్ రిప్రొడక్టివ్ సిస్టం" కు సంబంధించి విస్తృతంగా పలు అంశాల గురించ చర్చ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానస కిడ్నీ ఫౌండేషన్ తిరుపతి, బెంగళూరు నుండి డాక్టర్ అరుణిమ, విశాఖపట్నం నుండి డాక్టర్ మమత విభాగాధిపతి , మైసూరు మెడికల్ కాలేజీ నుండి డాక్టర్ అరుణ్, ప్రొఫెసర్ నిజామాబాద్ వైద్య కళాశాల నుండి ప్రొఫెసర్ డాక్టర్ సుధ , డాక్టర్ సేపూరి రామమోహన్ పై అంశం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఫారిన్సీక్ విభాగ వైద్యులు , దాదాపు అన్ని విభాగాల నుంచి 150 మంది పీజీ వైద్య విద్యార్థులు యూజీ వైద్య విద్యార్థులు మరియు ఎస్ వి వైద్య కళాశాల పి.ఆర్.ఓ, వీర కిరణ్ పాల్గొన్నారు.
Admin
Famous TV